Chandrababu Naidu: రాష్ట్ర అభివృద్ధే తన ఎజెండా అని, పాపులారిటీ, మైలేజీ కోసం తాను ఎప్పుడూ పని చేయలేదని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
Modi-Chandrababu Naidu:: హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ తన పేరు ప్రస్తావించకపోవడం బాధ కలిగించిందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తన నిర్విరామ కృషి ఫలితంగా హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సంస్థ ఏర్పడిందన్నారు. అయితే, "ఐఎస్బీ ఏర్పాటు కోసం తాను చేసిన కృషిని ప్రస్తావించకపోవడం బాధిసింది" అని అన్నారు. అలాగే, రాష్ట్ర అభివృద్ధే తన ఎజెండా అని, పాపులారిటీ, మైలేజీ కోసం తాను ఎప్పుడూ పని చేయలేదన్నారు. శుక్రవారం జరిగిన మహానాడులో పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జన్మదినం(మే 28) సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఏటా మహానాడును నిర్వహిస్తుంది. ఈసారి ఒంగోలులో మహానాడును రెండు రోజుల పాటు మే 27, 28 తేదీల్లో నిర్వహిస్తోంది. గతంలో మూడు రోజుల పాటు సాగిన మహానాడు.. క్రమంగా మార్పులకు లోనవుతూ.. పలు కారణాలతో రెండు రోజులకే పరిమితం అయింది. అయితే, మహానాడు లో చంద్రబాబు మాట్లాడుతూ హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సంస్థ ఏర్పాటు గురించిన విషయాలను ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐఎస్బీని హైదరాబాద్ కు తీసుకురావడానికి తన సర్వశక్తులు ఒడ్డిన తీరును గుర్తు చేసుకున్నారు. "ఐఎస్బి 20వ వార్షిక దినోత్సవ వేడుకల్లో ప్రధాని ప్రసంగించారు. ప్రధాని నా పేరు ప్రస్తావించలేదు. పర్వాలేదు. నా తెలుగు ప్రజల కోసం నేను అలా చేశాను, అది నాకు సంతృప్తినిస్తుంది" అని చంద్రబాబు నాయుడు అన్నారు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ఏర్పాటుకు సంబంధించి హైదరాబాద్ను పరిగణనలోకి తీసుకోవాలని తాను కోరినప్పుడు బెంగళూరు, ముంబై మరియు చెన్నైలను సంస్థను గుర్తించడానికి తాము పరిశీలిస్తున్నామని ISB థింక్ ట్యాంక్ చెప్పిందని చంద్రబాబు నాయుడు చెప్పారు. హైదరాబాద్ తమ ప్రాధాన్యత జాబితాలో లేదని, అయితే ఆయన పదే పదే కోరడంతో సందర్శనకు అంగీకరించారని చెప్పారు. అల్పాహారానికి రావాల్సిందిగా వారిని ఫోన్లో అభ్యర్థించాను. తమ మంత్రులు ఎయిర్పోర్టులో వారిని స్వీకరించారు. తాను వ్యక్తిగతంగా వారికి అల్పాహారం అందించి పెద్ద ప్రాజెక్ట్ను సాధించేందుకు వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశానని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ క్రమంలోనే అనేక అడ్డంకులను ఎదుర్కొని ఐఎస్బీని హైదరాబాద్ కు తీసుకువచ్చానని చెప్పారు.
తెలుగు ప్రజల కోసం టీడీపీ ఇలాంటి వందల ఆభరణాలాంటి ప్రాజెక్టులను తీసుకొచ్చిందని.. కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో జీనోమ్ వ్యాలీ యావత్ దేశాన్ని ఆదుకున్నదని.. పొరుగు రాష్ట్ర ప్రజలు గొప్ప ప్రయోజనాలను పొందుతున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తీసుకొచ్చిన సంస్థలు, ప్రాజెక్టులు రాష్ట్ర ప్రగతిలో ఎంతో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. శరీరక శ్రమ నుంచి బుద్ధి సంబంధమైన ప్రయత్నాలకు కొత్త దిశానిర్దేశం చేశారు... అందుకే ఐటీ పెద్దఎత్తున అభివృద్ధి చెందింది.. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు విదేశాలకు వెళ్లి పురుషుల కంటే కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు అని చంద్రబాబు అన్నారు.
