Asianet News TeluguAsianet News Telugu

కోడిగుడ్ల బిల్లులు కూడా కట్టలేదు.. ప్రతి బకాయి వైసీపీనే చెల్లించింది, వాస్తవాలు చెప్పండి : యనమలపై బుగ్గన ఫైర్

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుపై మండిపడ్డారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కనీసం కోడిగుడ్ల బిల్లులు కూడా టిడిపి ప్రభుత్వం చెల్లించలేదని బుగ్గన ఎద్దేవా చేశారు. 

buggana rajendranath reddy slams ex minister yanamala ramakrishnudu over ap financial status
Author
First Published Nov 2, 2022, 6:37 PM IST

మాజీ ఆర్ధిక మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుపై విమర్శలు గుప్పించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. బుధవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... యనమలకు క్షేత్ర స్థాయి వాస్తవాలు తెలియటం లేదన్నారు. అందుకే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని బుగ్గన చురకలంటించారు. చరిత్రలో లేని అప్పులు టిడిపి ప్రభుత్వం చేసిందని... రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టారని ఆయన దుయ్యబట్టారు. కనీసం కోడిగుడ్ల బిల్లులు కూడా టిడిపి ప్రభుత్వం చెల్లించలేదని బుగ్గన ఎద్దేవా చేశారు. బకాయి పెట్టీ వెళ్లిన సున్నావడ్డీ పంట రుణాలు రూ. 774 కోట్లు వైసిపి ప్రభుత్వమే చెల్లించిందని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. 

తమ ప్రభుత్వ హయాంలో ఎప్పటికపుడు రూ. 497 కోట్లు కూడా చెల్లించామని బుగ్గన పేర్కొన్నారు. రూ. 1785 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ కూడా తమ ప్రభుత్వమే ఇచ్చిందని రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ అంచనా వేసేందుకు స్మార్ట్ మీటర్లు పెట్టామని... 20 శాతం వరకూ విద్యుత్ నష్టాల కింద విద్యుత్ పంపిణీ సంస్థలు రాస్తున్నాయని మంత్రి తెలిపారు. ఉచిత విద్యుత్ కూడా ఇదే ఖాతాలో వేసేస్తున్నారని అందుకే ఈ స్మార్ట్ మీటర్లు తెస్తున్నట్లు బుగ్గన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి లెక్కల్ని కూడా టిడిపి తప్పుడు కోణంలో చూస్తోందని... వైద్య ఆరోగ్యంలోనూ ఇదే తరహా ఆరోపణలు చేస్తున్నారని ఆర్ధిక మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALso REad:తెలుగుదేశం పొత్తు పెట్టుకోనిది ఒక్క వైసీపీతోనే... టీడీపీకి జనసేనకి పెళ్లిళ్లు, విడాకులు కామన్ : బుగ్గన

3255 ఆరోగ్య శ్రీ చికిత్సలను తమ ప్రభుత్వం అందిస్తోందని... గతంలో 1055 చికిత్సలు మాత్రమే అందించారని బుగ్గన గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీలో అందించని చికిత్సల్లో మాత్రమే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందుతుందని మంత్రి తెలిపారు. ఎక్కడైనా శవాలను 108/104 అంబులెన్స్‌ల్లో తరలిస్తారా అని బుగ్గన ప్రశ్నించారు. ప్రతి ఆస్పత్రిలో మహాప్రస్థానం వాహనాలు ఉన్నాయని.. వైద్య ఆరోగ్యం కోసం పీహెచ్‌‌సిలు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. రూ. 12,268 కోట్లతో మల్టీ, సూపర్ స్పెషాలిటీ, బోధనాసుత్రులు నిర్మాణం చేపట్టినట్లు బుగ్గన పేర్కొన్నారు. 

రూ. 1477 కోట్లను 2022-23 ఆర్థిక సంత్సరానికి ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు చేశామని... నాడు - నేడు కోసం పాఠశాలలకు వేల కోట్లతో బాగు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అమ్మఒడి కోసం రూ. 13,600 కోట్లు ఖర్చు చేశామని... రూ.53 వేల కోట్లను పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చు చేసిందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఒక్క పాఠశాలను కూడా ప్రభుత్వం తొలగించలేదని స్పష్టం చేశారు. కొత్తగా పాఠశాలలు ఏర్పాటు చేశామని... తల్లుల సంఖ్య ఆధారంగా అమ్మవొడి ఇచ్చామని మంత్రి తెలిపారు. టాయిలెట్‌ల కోసం వారి దగ్గర నుంచి రూ.2 వేలు వ్యయం చేస్తున్నామని.. టిడిపి హయాంలో 11 శాతం వృద్ధి రేటు చూపితే వాస్తవంలో 5.66 గా నమోదు అయ్యిందని బుగ్గన ఎద్దేవా చేశారు. 

Also REad:అమరావతిలోని 30 వేల ఎకరాల్లో 10 వేలు వెయ్యి మంది చేతుల్లోనే.. చిట్టా విప్పమంటారా : అసెంబ్లీలో బుగ్గన

రాష్ట్ర అప్పులు టిడిపి హయాంలో 19.55 శాతం మేర పెరిగితే.. వైసీపీ హయాంలో పెరిగింది కేవలం 15 శాతం మాత్రమేనని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు. ఐదేళ్ల కాలంలో టిడిపి కేవలం 2,13,626 ఎకరాలకు మాత్రమే నీరు అందించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తమ ప్రభుత్వ హయాంలో 10 లక్షల ఎకరాలకు నీరు అందుతోందని రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టులోనూ టిడిపి హయాంలో చేసిన తప్పులకు ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితి వుందని.. పసుపు కుంకుమ కోసం డిబిటి కింద డబ్బులు ఇచ్చామని టిడిపి చెప్పుకుంటోందని ఆయన దుయ్యబట్టారు.

జూన్ 2019 నుంచి మొదలైన పెన్షన్ పెంపు త్వరలోనే రూ.2750కి పెరుగుతుందని... రోడ్లను బాగు చేసేందుకు కోవిడ్ అడ్డు వచ్చిందని రాజేంద్రనాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల నిర్మాణంపై కొంత ఎక్కువ దృష్టి పెట్టామని మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమల రంగంలోనూ వేగంగా చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన... 9 ఫిషింగ్ హార్బర్ లు నిర్మాణం లో ఉన్నాయని తెలిపారు. ముందు యనమల తన నియోజకవర్గం తునికి వెళ్ళాలని కోరుతున్నానంటూ రాజేంద్రనాథ్ రెడ్డి సెటైర్లు వేశారు 

Follow Us:
Download App:
  • android
  • ios