ఏపీ: గనుల శాఖ మంత్రి క్వారీ నుంచి దూసుకొచ్చిన రాయి... మామిడి కూలీ మృతి
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కంకర రాళ్ల క్వారీలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. చౌడేపల్లి మండలం కడియాలకుంట గ్రామంలో ఏపీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ కంకర రాళ్లలో పనులు జరుగుతున్నాయి.
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కంకర రాళ్ల క్వారీలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. చౌడేపల్లి మండలం కడియాలకుంట గ్రామంలో ఏపీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ కంకర రాళ్లలో పనులు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో క్వారీ నుంచి దూసుకొచ్చిన రాయి తగలడంతో ఓ వ్యవసాయ కూలీ చనిపోయాడు. ఈ క్వారీకి సమీపంలోని తోటలో మామిడి కాయలు కోసేందుకు కొందరు కూలీలొచ్చారు. వీరు మామిడితోటలో కాయ దింపుతుండగా క్వారీలో పేలుడు జరుగుతుందని నిర్వాహకులు వీరికి సమాచారం ఇచ్చారు.
Also Read:మామిళ్లపల్లి పేలుడు కేసు: జగన్ కుటుంబంలో అరెస్ట్ కలకలం.. పోలీసుల అదుపులో వైఎస్ ప్రతాపరెడ్డి
దీంతో కూలీలు ట్రాక్టర్లో బయలుదేరుతున్న సమయంలోనే క్వారీలో పేలుడు జరిగి ఓ రాయి వేగంగా దూసుకు వచ్చింది. అది జహీర్ అనే కూలీకి బలంగా తగలడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.