జగన్తో అవంతి భేటీ: వైసీపీలో చేరిక లాంఛనమే
అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గురువారం నాడు లోటస్పాండ్లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్తో భేటీ అయ్యారు.
హైదరాబాద్: అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గురువారం నాడు లోటస్పాండ్లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్తో భేటీ అయ్యారు.
బుధవారం రాత్రి నుండి అవంతి శ్రీనివాస్ టీడీపీ నాయకత్వానికి దూరంగా ఉన్నారు. గురువారం నాడు హైద్రాబాద్లో వైసీపీ నేతలతో అవంతి శ్రీనివాస్ భేటీ అయ్యారు.వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డితో పాటు విశాఖకు చెందిన వైసీపీ నేతలతో కలిసి అవంతి శ్రీనివాస్ గురువారం నాడు మధ్యాహ్నం లోటస్పాండ్లో జగన్తో భేటీ అయ్యారు.
ఈ మాసంలో విశాఖలో నిర్వహించే వైసీపీ సమర శంఖారావం సభలో అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరనున్నారు.తనతో పాటు మరోకరికి కూడ ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వాలని అవంతి శ్రీనివాస్ కోరుతున్నట్టు సమాచారం.
సంబంధిత వార్తలు
టీడీపికి అవంతి రాజీనామా: సబ్బం హరికి లైన్ క్లియర్
త్యాగానికి గంటా రెడీ: టీడీపీ నేతల టచ్ లోకి రాని అవంతి
టీడీపీకి అవంతి రాజీనామా, రేపు జగన్ను కలిసే అవకాశం
చంద్రబాబుకు మరో షాక్: వైసీపీలోకి అవంతి, ముహూర్తం ఖరారు
చంద్రబాబుకు మరో షాక్: వైసీపీలోకి అవంతి, ముహూర్తం ఖరారు
టీడీపీకి మరోషాక్: వైసీపీలోకి సిట్టింగ్ ఎంపీ..?