Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 27న విశాఖలో ఏపీ కేబినెట్ సమావేశం?

ఏపీ కేబినెట్ సమావేశం విశాఖపట్టణంలో నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు. 

Ap Cabinet meeting on December 27 in Visakhapatnam
Author
Visakhapatnam, First Published Dec 24, 2019, 3:08 PM IST

విశాఖపట్టణం: ఈ నెల 27వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం విశాఖపట్టణంలో  నిర్వహించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే  విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో జీఎన్ రావు కమిటీకి కేబినెట్  ఆమోదం తెలపనుంది.

Also read:ఫేక్ లెటర్స్ తో నాకు సంబంధం లేదు.. 3 రాజధానులపై చిరంజీవి క్లారిటీ!

ఏపీకి రాజధానుల విషయమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ ఇటీవలనే ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నివేదికను ఇచ్చారు. ఈ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించాలని కమిటీ సూచించింది.

also read:ఏపీకి మూడు రాజధానులు: పవన్‌కు షాకిచ్చిన చిరు, జగన్ జై

కర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటు చేయాలని సూచించింది. విశాఖ, అమరావతిలలో హైకోర్టు బెంచ్‌లు కూడ ఏర్పాటు చేయాలని కమిటీ  సూచించింది. ఈ తరుణంలో విశాఖలో మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.  

విశాఖలో లులు గ్రూపుకు కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం రద్దు చేసుకొంది. ఐదెకరాల స్థలంలో బీచ్ రోడ్డులో ఈ ఫంక్షన్ హాల్ ఉంది. గత ప్రభుత్వం ఈ ఫంక్షన్ హాల్ ను లులు గ్రూప్‌కు కేటాయించింది. ఈ అనుమతులను జగన్ సర్కార్ రద్దు చేసింది. 

also read‘‘మెగా’’ కన్‌ఫ్యూజన్: జగన్‌కి జై కొట్టిన చిరు.. 4 బిల్డింగ్‌లతో అభివృద్ధి కాదన్న పవన్

ఐదెకరాల స్థలంలో ఉన్న ఈ ఫంక్షన్ హాల్‌లో మంత్రిర్గ సమావేశం నిర్వహిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత లేదు. పార్కింగ్ సమస్య కూడ లేకుండా ఉండేందుకు ఈ స్థలాన్ని ఎంపిక చేశారని అంటున్నారు. ఫంక్షన్‌హాల్‌కు అనుకొని ఉన్న 11 ఏపీఐఐసీ భూమి కూడ ఉంది. విశాఖలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు విషయమై ఈ నెల 25వ తేదీన స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios