విశాఖ కనకమహలక్ష్మి ఆలయంలో కోవిడ్ నిబంధనలు.. పాటిస్తేనే దర్శనం..

Aug 7, 2020, 2:23 PM IST

విశాఖ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం మూడో శుక్రవారం వేడుకలు వైభవంగా జరిగాయి. అమ్మవారికి పంచామృత అభిషేకాలు,  కుంకుమ పూజలు సహస్ర తంగా పూజలు జరిపారు. అనంతరం అమ్మవారిని అలంకరించి కోవిడ్ నిబంధనలను అనుసరించి మాస్కులుతో వచ్చిన వారికి మాత్రమే దర్శనం కల్పించారు. కరోనా కారణంగా భక్తుల భద్రత దృష్ట్యా ఆలయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని ఆలయ అధికారి జ్యోతి మాధవి తెలిపారు.