భువనేశ్వర్ కుమార్ కోసం ఆర్సీబీ సర్ ప్రైజ్ ఎంట్రీ..
భువనేశ్వర్ కుమార్ పేరు వేలంలోకి రావడంతో ముంబై, లక్నో యజమానులు అతన్ని దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. వీరిద్దరి మధ్య వేలం పెరుగుతూనే ఉంది. రెండు జట్లు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా కనిపించలేదు. ఒకానొక దశలో వేలం రూ.10 కోట్లు దాటగా, ముంబై జట్టు భువీకి రూ.10.5 కోట్లు పెట్టింది. దీంతో లక్నో టీమ్ వైపు అందరి చూపులు మళ్లాయి. కానీ, ఆ టీమ్ చేతులెత్తేసింది. ఇదే క్రమంలో సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది ఆర్సీబీ. భువనేశ్వర్ను 10.75కి వేలం వేసి రెండు జట్లకు షాకిచ్చింది. ఇద్దర మధ్య ఫైట్ లో మూడో టీమ్ భువనేశ్వర్ కుమార్ ను ఎగురేసుకుపోయింది.