కొడుకు పుట్టాక భర్త మొహం చూడడంలేదంటూ భర్తకోసం భార్య ధర్నా

Mar 10, 2020, 5:41 PM IST

పెళ్లి చేసుకుని పిల్లాడు పుట్టాక మొహం చూడడం లేదంటూ ఓ మహిళ కరీంనగర్ ధర్నా సెంటర్ లో ధర్నాకు దిగింది. కరీంనగర్ కమర్షియల్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న దాసరి శరత్ చంద్రకు మౌనికతో వివాహం అయ్యింది. వీరికి ఓ బాబు ఉన్నాడు. బాబు పుట్టాక తనతో దూరంగా ఉంటున్నాడని ఈ విషయమై గోదావరిఖని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని వాపోయింది.