photo credit- rashmi Instagram
జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది. ఒకప్పుడు రష్మీ, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించింది. రష్మీ గురించి సోషల్ మీడియాలో తరచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది. బుల్లితెరపై యాంకర్ల మధ్య ఎలాంటి పోటీ ఉందో చూస్తూనే ఉన్నాం. ఆ పోటీ ఎఫెక్ట్ ని రష్మీ కూడా ఎదుర్కొంది.
Rashmi Gautam
రష్మీ నేడు తన 36 వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా రష్మీ కి సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. అనసూయ స్టార్ యాంకర్ గా బుల్లితెరపై దూసుకుపోతున్న రోజుల్లో రష్మీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రష్మీ ఎంట్రీకి కొన్ని వారాల ముందే జబర్దస్త్ ప్రారంభం అయింది.
అప్పటి వరకు జబర్దస్త్ షోకి అనసూయ యాంకర్ గా చేసింది. కానీ రష్మీ రావడంతో ఆ అవకాశం ఆమెకి దక్కింది. అనసూయ పక్కకి తప్పుకుందో.. లేక తప్పించారో తెలియదు కానీ ఆ అవకాశం రష్మీకి రావడంతో అప్పట్లో నెటిజన్లకు నచ్చలేదు. రష్మీ ట్రోల్ చేస్తూ దారుణంగా విరుచుకుపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో రష్మీ దీని గురించి బోల్డ్ గా స్పందించింది.
Rashmi Gautam
నాకు సంబంధం లేని విషయంలో నన్ను ట్రోల్ చేశారు. నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను సైలెంట్ గా ఉండిపోయా. 13 ఎపిసోడ్స్ కే జబర్దస్త్ కి ఇంత క్రేజ్ ఏంటి అని గమనిస్తున్నా..కానీ నన్ను దారుణంగా తిట్టారు అని రష్మీ వాపోయింది.
ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ నా లాంటి వారు ఎవరైనా అనసూయ గురించి ఇలా అడిగితే ఎలాంటి సమాధానాలు ఇస్తావు అని ప్రశ్నించింది. రష్మీ నువ్వు అనసూయ ప్లేస్ ని ఎందుకు ఆక్రమించావు అని ఆ యాంకర్ అడిగింది.. రష్మీ సమాధానం ఇస్తూ.. నేను ఆక్రమించుకోవడం ఏంటి.. లాగేసుకున్నా అంటూ పొగరుగా సమాధానం ఇచ్చింది.
అనసూయని పక్కకి పంపి నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగా.. అనసూయ చిన్న పిల్లా ఏంటి పక్కకి పంపడానికి అంటూ రష్మీ సమాధానం ఇచ్చింది. ఐక్య సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్దమే అని.. కాకపోతే డైరెక్టర్ ఎవరనేదానిపైనే నా నిర్ణయం ఉంటుందని రష్మీ తెలిపింది.