Oct 31, 2019, 4:49 PM IST
హైద్రాబాద్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఆడ శిశువును సజీవంగా పాతి పెట్టడానికి ప్రయత్నించాడు. గమనించిన ఆటోడ్రైవర్ అడ్డుకోగా తన మనవరాలు చనిపోయిందని అందుకే పాతిపెడుతున్నానని బుకాయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా అఫ్జల్ గంజ్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శిశువుని చికిత్స నిమిత్తం ఉస్మానియా తరలించారు.