రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత కలకలం..

Oct 1, 2022, 10:11 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లాలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామ శివారులో చిరుత దాడిలో లేగ దూడ మృతి చెందిన ఘటన మరువకముందే, మరోసారి ఇదే మండలంలోని గోపాల పల్లె గ్రామంలో మరో లేగ దూడపై దాడి చేసిన చిరుత. మండల ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.