బీహార్లోని గయ జిల్లాలో బిహియా అనే ఊరుంది. ఈ ఊరికి ఓ చరిత్ర ఉంది. మూడు శతాబ్దాలుగా ఇక్కడి ప్రజలు నియమ నిష్ఠలతో, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఆచారాలను పాటిస్తూ వస్తున్నారు. 400 కుటుంబాలు ఉన్న ఈగ్రామంలో 300 ఏళ్ల నుంచి అందరు శాకాహారులుగానే కొనసాగుతున్నారు. వీరు పూజించే బ్రహ్మ బాబా ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే శాకాహార జీవన విధానాన్నే అవలంబించాలన్నది వీరి నమ్మకం.
ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్ని ఈ తరం వారు కూడా పాటిస్తున్నారు. ఇక్కడి వారిని పెళ్లి చేసుకుని వచ్చే వారు కూడా ఇదే లైఫ్ స్టైన్ లో ఆమలు చేయాల్సిందే. శాకాహారులుగానే మారుతున్నారు. వీరు మద్యపానానికి దూరంగా ఉంటారు. ఉల్లి, వెల్లుల్లి కూడా తినరు. ఈగ్రామంతో పాటు మరో గ్రామం కూడా పూర్తి శాఖాహార గ్రామంగా ఉంది. అది మహారాష్ట్రాలో ఉంది.