కొండగట్టుకు బయలుదేరిన పవన్ కల్యాణ్... ఇంటివద్ద అభిమానుల కోలాహలం

Jan 24, 2023, 12:03 PM IST

హైదరాబాద్ :  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో ప్రచారవాహనం 'వారాహి' కి తొలిపూజ చేయించనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుండి కొండగట్టుకు భారీ కాన్వాయ్ తో బయలుదేరిన పవన్ కు మార్గమధ్యలో అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పవన్ ఇంటి నుండే అభిమానుల కోలాహలం మొదలయ్యింది. పవన్ బయలుదేరడానికి ముందే ఆయన ఇంటివద్దకు భారీగా అభిమానులు చేరుకోగా వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు పవన్. ఇలా దారిపొడవునా పవన్ చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.