పచ్చి పాలలో క్రిప్టోస్పోరిడియం, క్యాంపిలోబాక్టర్, బ్రూసెల్లా, లిస్టేరియా వంటి హానికర బ్యాక్టీరియాలు ఉంటాయి. వేడి చేసి తాగితే ఇవి నాశనం అయి, పాలు సురక్షితం అవుతాయి. రోజూ పాలు తాగేవాళ్ళు ప్యాకెట్ పాలను వేడి చేయాల్సిన అవసరం లేదు. కాస్త గోరువెచ్చగా చేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది.
పాల ప్యాకెట్ మీద ఆ పాలను ఎలా వాడాలి అని రాసి ఉంటుంది.. దాని ప్రకారం మాత్రమే ఆ పాలను వేడి చేసుకోవాలి. కొన్నింటిని మరిగించకుండా, వేడి చేస్తే సరిపోతుంది.