వైన్ షాపుల్లో చోరీ.. కావాల్సినవి మాత్రమే తీసుకెళ్లిన దొంగలు...

Jul 3, 2020, 12:09 PM IST

కరీంనగర్ మండలం తీగల గుట్టపల్లి ప్రధాన రహదారిపై ఉన్న రెండు వైన్ షాపుల్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు నిన్న రాత్రి వైన్ షాప్ వెనుకభాగం నుంచి లోనికి ప్రవేశించి అందులో ఉన్న మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. ఒక వైన్ షాప్ లో సిసి కెమెరాల కనెక్షన్ తీసేందుకు ప్రయత్నించారు. అయితే మరో సిసి కెమెరాల్లో దొంగతనం విజువల్స్ రికార్డయ్యాయి. వారికి కావాల్సిన బ్రాండ్లు మాత్రమే తీసుకెళ్లారని షాపు యజమానులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.