ఎమ్మెల్యే సోదరి మృతి కేసులో వీడిన మిస్టరీ...

Jun 23, 2020, 1:39 PM IST

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సొంత చెల్లెలు రాధ కుటుంబం మృతి కేసులో మిస్టరీ వీడింది. రాధ భర్త సత్యనారాయణ రెడ్డి ఫర్టిలేజర్ దుకాణం నిర్వహించడంతోపాటు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. కొంతకాలంగా వీరు కరీంనగర్ లోని బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్నారు. జనవరి 27న కనిపించకుండా పోయిన వీరు 21 రోజుల తరువాత ఫిబ్రవరి 17న అల్గునూరు శివారులోని ఎస్ఆర్ఎస్ పి కాలువలో మృతులై కనిపించారు. పోలీసుల విచారణలో సత్యనారాయణరెడ్డిఫర్టిలైజర్ దుకాణంలోఒక సూసైడ్ నోట్ కనిపించింది. అయితే అతనే రాసిందా లేదా అనికనిపెట్టడానికి పోలీసులు ఆ నోటును నిపుణుల అభిప్రాయం కోసం పంపారు. ఈనోట్ సత్యనారాయణరెడ్డి రాసినట్లుగా వారు ధృవీకరించడంతో వీరి మృతిపై అనుమానాలు తొలగిపోయాయి.