వైకాపా ఎంపీకి షాక్... విడదల రజని రేంజే వేరు..

Jul 2, 2020, 10:28 AM IST

గుంటూరు జిల్లా, చిలకలూరిపేట నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను ఎమ్మెల్యే రజినీ వర్గీయులు ఊర్లోకి రాకుండా అడ్డుకున్నారు. తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వైకాపా కార్యకర్త గంటా హరికృష్ణ  కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎంపీని రజినీ వర్గీయుడు, మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి అడ్డుకున్నాడు.  గ్రామ సమీపంలోకి ఎంపీ కారు రాగానే అప్పటికే అక్కడకి చేరుకున్న ఎమ్మెల్యే విడదల రజిని వర్గీయులు ఆయన్ని అడ్డుకున్నారు. మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యేకు చెప్పకుండా ఎలా వస్తారని ఎంపీని ప్రశ్నించారు. పరామర్శ కోసమే కదా అని ఎంపీ చెప్పినా పట్టించుకోలేదు. వాహనానికి అడ్డుపడ్డారు. చివరకు పోలీసులు జోక్యంతో అతను పరామర్శకు 
అతికష్టమ్మీద వెళ్లాల్సి వచ్చింది.