Sep 23, 2020, 10:33 PM IST
IPL 2020లో ఆడుతున్న రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఓపెనర్ డి కాక్ ఒక్క పరుగుకే అవుటైనా సూర్యకుమార్ యాదవ్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు రోహిత్ శర్మ. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్కి 90 పరుగులు జోడించారు.