వారాహి వాహనానికి ఘాట్ రోడ్ లో అనుమతి నిరాకరణ.. కొండ దిగవనున్న అమ్మవారి వద్దే పూజలు..

Jan 25, 2023, 11:45 AM IST

విజయవాడ : జనసేన ఎన్నికల ప్రచారరథం వారాహికి ఆంధ్రప్రదేశ్ లో ఆంక్షలు మొదలయ్యాయి. నేడు వారానికి ఇంద్రకీలాద్రి పై  పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వారాహి వాహనానికి ఘాట్ రోడ్ లో  అనుమతిని పోలీసులు నిరాకరించారు. కొండ దిగవనున్న అమ్మవారి వద్ద వారాహి పూజలు చేయాలని సూచించారు.  వారాహి వాహనానికి పూజలు చేసి దుర్గమ్మ దర్శనం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ కు సూచించారు. వారాహి పూజల నేపథ్యంలో ఇంద్రకీలాద్రి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణలంకలో వందలాది మంది మహిళలు వారాహికి హారతులు ఇచ్చి స్వాగతం పలకనున్నారు.