'నా పెళ్లాం పతివ్రత'...చంద్రబాబు, భువనేశ్వరి, మాధవరెడ్డి ఫోటోలతో వాల్ పోస్టర్లు

Sep 28, 2022, 11:06 AM IST

విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని అవమానించేలా విజయవాడ బెంజ్ సర్కిల్ లో రాత్రికిరాత్రే వెలిసిన గోడ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. గతంలో అసెంబ్లీలో తన భార్యను అవమానించారంటూ చంద్రబాబు కన్నీటిపర్యంతమైన ఫోటో... ''నా పెళ్లాం పతివ్రత'' అంటూ అనుచిత కామెంట్స్ తో కూడిన పోస్టర్ గోడలపై వెలిసింది. అంతేకాదు ఈ వాల్ పోస్టర్ పై చంద్రబాబు భార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్ ఫోటోలతో పాటు ఎలిమినేటి మాధవరెడ్డి ఫోటో వుండటం కలకలం రేపుతోంది.