పరిటాల రవీంద్ర వర్ధంతి... మాజీ మంత్రి ఆనంద్ బాబు నివాళి

Jan 24, 2023, 1:26 PM IST

మంగళగిరి : రాయలసీమకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా ఆయనకు టిడిపి నాయకులు నివాళి అర్పించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టిడిపి పార్టీ జాతీయ కార్యాలయంలో రవీంద్ర విగ్రహానికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తో ఇతర నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవీంద్ర గొప్పతనాన్ని నాయకులు గుర్తుచేసుకున్నారు.