మట్టి మాఫియాపై ఉక్కుపాదం... మంగళగిరిలో 16 లారీలను పట్టుకున్న పోలీసులు

Jan 20, 2023, 5:05 PM IST

గుంటూరు : అక్రమంగా మట్టిని తరలిస్తున్న 16 భారీ లారీలను ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా నుండి గుంటూరు జిల్లా చినకాకానికి భారీఎత్తును మట్టిన తరలిస్తున్న 16 లారీలను 
మంగళగిరిలో పోలీసులు అడ్డుకున్నారు. మట్టి తరలింపుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో లారీలను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో లారీలో 40 టన్నులకు పైగా మట్టి వుంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ అక్రమ మట్టి తరలింపుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.