విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అపశృతి... క్యూలైన్ లో భక్తుడు మృతి

Sep 30, 2022, 2:33 PM IST

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా వివిధ అవతారాల్లో దర్శనమిస్తున్న విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తులు క్యూలైన్ లోనే మృతిచెందాడు. 

హైదరాబాద్ కు చెందిన మూర్తి(45) కనకదుర్గమ్మ దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి వచ్చాడు. రూ.500 క్యూలైన్ ద్వారా ప్రత్యేక దర్శనం కోసం వెళుతన్న అతడు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో కిందపడి గిలగిలా కొట్టుకున్నాడు. వెంటనే ఆలయ సిబ్బంది అతడి దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. కానీ అతడి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు.