కడపలో స్కూల్ ఆటో బోల్తా ... ఏడుగురు అమ్మాయిలకు గాయాలు

Jan 20, 2023, 1:57 PM IST

కడప : స్కూల్ విద్యార్థులతో వెళుతున్న ఆటో ప్రమాదానికి గురయి ఏడుగురు అమ్మాయిలు గాయపడిన దుర్ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. కలసపాడు మండల కేంద్రంలోని బాలికల పాఠశాలకు సమీపంలోని రాసుపాలెం గ్రామానికి చెందిన అమ్మాయిలు ఆటోలో వెళుతుంటారు. రోజూ మాదిరిగానే ఇవాళ కూడా 15మంది అమ్మాయిలను ఎక్కించుకుని స్కూల్ కి బయలుదేరిన ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బోల్తాపడింది. డ్రైవర్ మొబైల్ ఉపయోగిస్తూ ఆటో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని బాధిత అమ్మాయిలు చెబుతున్నారు. ఈ ఘటనలో ఏడుగురు అమ్మాయిలు గాయపడగా మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన విద్యార్థినులను దగ్గర్లోని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.