కొత్తగూడెం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్...సీపీఐ తాడోపేడో

By sivanagaprasad kodatiFirst Published Nov 13, 2018, 9:27 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ తొలి విడత జాబితాలో భాగంగా కొత్తగూడెం అభ్యర్థిని ప్రకటించడంపై సీపీఐ సీరియస్ అయ్యింది. ఇక్కడి నుంచి తమ అభ్యర్ధిగా సీనియర్ నేత వనమా వెంకటేశ్వరరావును ప్రకటించింది. 

కాంగ్రెస్ పార్టీ తొలి విడత జాబితాలో భాగంగా కొత్తగూడెం అభ్యర్థిని ప్రకటించడంపై సీపీఐ సీరియస్ అయ్యింది. ఇక్కడి నుంచి తమ అభ్యర్ధిగా సీనియర్ నేత వనమా వెంకటేశ్వరరావును ప్రకటించింది. దీనిపై కామ్రేడ్లు భగ్గుమంటున్నారు.

కూటమిలో ఉండాలా..? సర్దుకోవాలా అన్న దానిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర కమిటీ సమావేశమవుతోంది. కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 10 ఎంపీటీసీలు తమకు ఉన్నారని సీపీఐ నేతలు గుర్తు చేస్తున్నారు. బలమైన స్థానాన్ని కాంగ్రెస్‌కు వదులుకోవడం తమకు ఇష్టం లేదని కామ్రేడ్లు తొలి నుంచి వాదిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నాం ఏం జరుగుతుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

సీట్ల లొల్లి: ఢిల్లీకి సీపీఐ నేతలు, కాంగ్రెస్ తేల్చేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీడీపీ అభ్యర్థులు వీరే

సీట్ల లొల్లి: చాడతో కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి శ్రీనివాసన్ భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: దిక్కుతోచని స్థితిలో సీపీఐ

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

click me!