Published : Apr 21, 2025, 08:38 AM ISTUpdated : Apr 21, 2025, 11:53 PM IST

Telugu news live updates: Sachin vs Kohli:

సారాంశం

అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ సోమవారం భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నారు. నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా భార్య‌తో క‌లిసి ఇండియాకు వ‌స్తున్న జెడీ వాన్స్ ప్ర‌ధాని మోదీతో భేటీ కానున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి సంబంధించిన తాజా అప్డేట్స్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్‌ లైవ్‌ న్యూస్‌ అప్డేట్స్‌  అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.. 
 

Telugu news live updates: Sachin vs Kohli:

11:53 PM (IST) Apr 21

Sachin vs Kohli:

Sachin vs Kohli: 'సచిన్ రమేష్ టెండూల్కర్' ఈ పేరు తెలియని వారు, వినని వారు ఉండరు. నేటి తరానికి సచిన్‌ గురించి, అతని ఆట గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. 90వ దశకంలో పుట్టిన వారు, అంతకు ముందు పుట్టిన ప్రతి ఒక్కరూ క్రికెట్లో సచిన్‌ ఒక ట్రెండ్ సెట్టరని అంటారు. కొందరు గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ అని ముద్దుగా పిలుస్తుంటారు. సచిన్‌ క్రికెట్‌ చూసి ఎంతోమంది ఆటగాళ్లు క్రికెట్‌పై ఆసక్తి చూపారు. అలాంటి వాళ్లలో విరాట్ కోహ్లీ కూడా ఒకరు. అయితే... కోహ్లీ బ్యాటింగ్‌ యావరేజ్ చూస్తే సచిన్‌ కంటే అధికంగా ఉంది. సచిన్‌కు 40 యావరేజ్‌ ఉంటే.. కోహ్లీకి 60  వరకు ఉంది. దీంతో సచిన్‌ కంటే కోహ్లీ గొప్ప ఆటగాడు అని కొందరు అంటుంటారు. అసలు సచిన్‌కి, కోహ్లీకి ఏమైనా పోలిక ఉందా? 

పూర్తి కథనం చదవండి

11:42 PM (IST) Apr 21

IPL 2025 GT vs KKR : టాప్ లేపిన గుజరాత్ ... కెకెఆర్ పై అద్బుత విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. శుభ్ మన్ గిల్ బాధ్యతాయుతమైన కెప్టెన్సీతో జట్టును ముందుడి నడిపిస్తున్నాడు. దీంతో ఆ జట్టు వరుస విజయాలతో పాయింట్ టేబుల్ లో టాప్ లో నిలిచింది. తాజాగా కెకెఆర్ పై మరో అద్భుత విజయాన్నిఅందుకుంది. 

పూర్తి కథనం చదవండి

11:31 PM (IST) Apr 21

Health Benefits of Millets: వీటిని ఆహారంలో చేరిస్తే.. ఏ రోగం దరిచేరదు... ఎన్ని ప్రయోజనాలో!

Health Benefits of Millets:  కొర్రలు ఒక సంపూర్ణ ఆహారం, ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఎముకల ఆరోగ్యం, షుగర్‌ నియంత్రణ, రక్తహీనత నివారణ, బరువు తగ్గడం వంటి అనేక లాభాలు ఉన్నాయి.
 

పూర్తి కథనం చదవండి

10:35 PM (IST) Apr 21

ఈ చిట్కాలు పాటిస్తే.. మీ కూలర్ ఏసీని మించి పని చేస్తుంది!

ఏసీలా పని చేసే కూలర్: బయట ఎండలు మండిపోతున్నాయి. వేడి, ఉక్కపోత, చెమటతో జనం అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఏసీ ఉంటే ఫర్వాలేదు గానీ..  ఏసీ బిగించుకునే స్తోమత అందరికీ ఉండదుగా. మరేం చేయాలి? ఇంట్లో ఉండే కూలర్ తోనే ఏసీలా పని చేయిస్తే పోలా! అదెలాగంటారా..? చిట్కాలు మేం చెబుతాం. సింపుల్ గా మీరు ఫాలో అయితే చాలు. 

పూర్తి కథనం చదవండి

10:10 PM (IST) Apr 21

Pope Francis death : పోప్ ను ఎలా ఎంపికచేస్తారు? తర్వాతి పోప్ ఎవరు?

క్యాథలిక్ చర్చి అధినేత, వాటికన్ నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు. వయసు మీదపడటంతో అనారోగ్యానికి గురయిన ఆయన సోమవారం కన్నుమూసారు. దీంతో తర్వాతి పోప్ ఎవరు? అనేదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. 

పూర్తి కథనం చదవండి

09:50 PM (IST) Apr 21

GT vs KKR : గిల్ కెప్టెన్ ఇన్సింగ్స్ ... టీం కోసం ఆడి సెంచరీ మిస్

ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై భారీ స్కోరు సాధించింది. శుభ్‌మన్ గిల్ (90), సాయి సుదర్శన్ (52), జోస్ బట్లర్ (41) రాణించడంతో జిటి 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.

పూర్తి కథనం చదవండి

09:07 PM (IST) Apr 21

జెడి వాన్స్ ఫ్యామిలీకి ప్రధాని మోదీ ఆత్మీయ స్వాగతం... భేటీలో చర్చించే అంశాలివేనా?

ప్రధాని మోడీ అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్, పిల్లలను ఢిల్లీలోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వాన్స్ కుటుంబం భారత్ కు చేరుకుంది... అత్తవారి దేశంలో వాన్స్ కు అపూర్వ గౌరవం దక్కుతోంది. 

 

పూర్తి కథనం చదవండి

08:19 PM (IST) Apr 21

బెంగళూరులో దారుణం ...వైమానిక దళ దంపతులసపై నడిరోడ్డుపై దాడి

ఐటీ సిటీ బెంగళూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. వైమానిక దళంలో పనిచేసే దంపతులపై అకారణంగా దాడికి పాల్పడ్డాడో దుండగుడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

పూర్తి కథనం చదవండి

08:00 PM (IST) Apr 21

Raj Kasireddy Arrested: రాజ్‌ కసిరెడ్డి అరెస్ట్.. మాటువేసి పట్టుకున్న పోలీసులు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే!

Raj Kasireddy Arrested: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి అలియాస్‌ రాజ్ కసిరెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సమయంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారని సమాచారం. అయితే... రాజ్ కసిరెడ్డి మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే రెండు ఆడియోలను విడదల చేశారు. దీంతోపాటు పోలీసుల విచారణకు హాజరు కాకుండా.. హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు పోలీసులు రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 

పూర్తి కథనం చదవండి

06:48 PM (IST) Apr 21

Gold Price : తులం బంగారం అక్షరాల లక్ష రూపాయలు

సోమవారం సాయంత్రానికి బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరింది. ఈ ఏడాది ఆరంభంనుండి రోజురోజుకు వందలు, వేలలో పెరుగుతూ వచ్చిన బంగారం ఇవాళ లక్ష రూపాయల మార్కును దాటింది. హైదరాబాద్ లో ప్రస్తుతం తులం బంగారం ధర ఎంతో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

05:54 PM (IST) Apr 21

Odela-2 Movie: కోడి పందేలు చూసి.. పొలాల్లో ఫస్ట్ నైట్ సీన్ పెట్టాం.. డైరెక్టర్‌ సంపత్‌నంది షాకింగ్‌ కామెంట్స్

Odela-2 Movie: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన ఓదెల-2 చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ సంపత్‌ నంది రాశారు. ఓదెల 2 సినిమాలో వశిష్ట సింహా విలన్‌గా నటించాడు. దుష్టశక్తి నుంచి గ్రామాన్ని కాపాడేందుకు పోరాటం చేసే భైరవి పాత్రలో తమన్నా తన యాక్టింగ్‍తో మెప్పించారు. ఇక చిత్రంలో యువ, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. సినిమాకి అజ్నిష్ లోకనాథ్ దర్శకత్వం వహించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‍వర్క్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 

పూర్తి కథనం చదవండి

05:54 PM (IST) Apr 21

ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ తల్లికి ఇచ్చిన భర్త్ డే గిప్ట్ ఏంటో తెలుసా? వజ్రవైఢ్యూర్యాలు, ఖరీదైన కార్లు కాదు

వరల్డ్ రిచ్చెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్ తల్లి మయే మస్క్ మన దేశంలో భర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న తల్లికి ఓ అద్భుతమైన బహుమతిని పంపించారు. కొడుకు పంపిన గిప్ట్ ను చూసి ఉబ్బితబ్బిబయిన ఆ తల్లి ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకూ మస్క్ తల్లికి ఇచ్చిన భర్త్ డే గిప్ట్ ఏంటో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

04:43 PM (IST) Apr 21

Ola: రూ. 39 వేల‌కే ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌.. 112 కిలోమీట‌ర్ల మైలేజ్‌, మ‌రెన్నో సూప‌ర్ ఫీచ‌ర్స్

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు ప్ర‌జ‌ల‌కు ఎక్కువ‌గా మొగ్గు చూపుతున్నారు. ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతుండ‌డం, ప్ర‌భుత్వాలు స‌బ్సిడీలు అందిస్తుండ‌డంతో చాలా మంది ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. దీంతో ఈ రంగంలో పోటీ కూడా తీవ్ర‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ త‌యారీ సంస్థ ఓలా తాజాగా మార్కెట్లోకి కొత్త స్కూటీని లాంచ్ చేస్తోంది. ఇంత‌కీ ఏంటా స్కూటీ, అందులో ఎలాంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

04:39 PM (IST) Apr 21

Telangana : జనాల మధ్యలో దిగిన మంత్రుల హెలికాప్టర్ ... రైతుల ప్రాణాలతో చెలగాటం

నిజామాబాద్ లో జరిగిన రైతు మహోత్సవంలో హెలికాప్టర్ అనుకోకుండా జనం మధ్యలో దిగడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కొందరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి, కానీ మంత్రులు, ప్రజలు సురక్షితంగా ఉన్నారు.

పూర్తి కథనం చదవండి

04:21 PM (IST) Apr 21

CM Revanth: కాలుష్య రహిత హైదరాబాద్‌ లక్ష్యం.. జపాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ కీలక ఒప్పందాలు!

CM Revanth: 
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి జపాన్‌ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ను దేశంలోనే నంబర్‌ వన్‌ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జపాన్‌ ప్రతినిధులతో పలు ఒప్పందాలను కుదురుచ్చుకున్నారు. దీనిలో భాగంగా తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యుషు నగరాన్ని సందర్శించింది. అక్కడ పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షిస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు అన్న విషయాలను తెలుసుకున్నారు. ఈ మేరకు కిటాక్యుషు నగర మేయర్‌ కజుహిసా టేకుచితో సీఎం రేవంత్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర అధికారులు భేటీ అయ్యారు. 

పూర్తి కథనం చదవండి

04:08 PM (IST) Apr 21

రూ. 500 నోట్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండండి.. మార్కెట్లో పెద్ద ఎత్తున న‌కిలీ నోట్లు, ఎలా గుర్తించాలంటే?

Fake 500 Rupees Notes: చ‌ట్టాలు ఎంత క‌ఠినంగా మారుతున్నా, ఎంత టెక్నాల‌జీ పెరుగుతోన్న నేరాలు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఓ వైపు సైబ‌ర్ నేరాల ద్వారా ప్ర‌జ‌ల ఖాతాల‌ను లూటీ చేస్తున్న కేటుగాళ్లు మ‌రోవైపు న‌కిలీ నోట్ల‌తో మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం మార్కెట్లో పెద్ద ఎత్తున న‌కిలీ రూ. 500 నోట్లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ఈ మాట చెబుతోంది మ‌రెవ‌రో కాదు సాక్ష్యాత్యు కేంద్ర ప్ర‌భుత్వం. ఇంత‌కీ ఈ నకిలీ నోట్ల‌ను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

03:09 PM (IST) Apr 21

BCCI Central contracts : పంత్ పంట పండిందిపో... ఐపిఎల్ లో రూ.27 కోట్లు, బిసిసిఐ నుండి ఎంతొస్తుందో తెలుసా?

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కు ఈ ఏడాది అంతా కలిసివస్తోంది. ఇప్పటికే అతడు ఐపిఎల్ ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్నాడు.. ఇప్పుడు బిసిసిఐ కూడా అతడికి ప్రమోషన్ ఇచ్చింది. దీంతో అతడి ఆదాయం మరింత పెరిగింది. బిసిసిఐ నుండి పంత్ ఎంత సాలరీ పొందనున్నాడో తెలుసా? అలాగే టీమిండియా ఆటగాళ్లలో ఎవరి జీతం ఎంత? 

పూర్తి కథనం చదవండి

02:19 PM (IST) Apr 21

అవును చంపింది భార్యే.. మాజీ పోలీస్ అధికారి మ‌ర‌ణం వెన‌కాల షాకింగ్‌ నిజాలు

కర్ణాటక మాజీ పోలీస్ అధికారి ఓం ప్రకాష్‌ని ఆయన భార్యే హత్య చేసింది. ఆదివారం ఇంట్లో గొడవ తర్వాత, ఆమె ఆయనపై కారం పొడి చల్లి, కట్టేసి, చాకూతో పొడిచి చంపేసింది.ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. ఇందులో కూతురు పాత్ర గురించి పోలీసులు విచారిస్తున్నారు.

పూర్తి కథనం చదవండి

01:56 PM (IST) Apr 21

Suriya and Jyothika: శక్తి పీఠాలను సందర్శించడం ఆశీర్వాదం అంటున్న సూర్య, జ్యోతిక జంట.. సినిమా ముచ్చట్లు ఇలా!

Suriya and Jyothika: తమిళ్‌, తెలుగు చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన యాక్టర్‌ సూర్య, అతని సతీమణి జ్యోతిక కలిసి కొల్హాపూర్‌లోని శక్తిపీఠాలను సదర్శించారు. లవ్‌లీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న వీరు.. వరుస సినిమాలతో ఎవరికి వారు బిజీ అయ్యారు. తాజాగా ఒకరు నటించిన సినిమా విడుదలకు సిద్దం కాగా.. మరొకరి సినిమా ప్రారంభమానికి సిద్దమైంది. ఈ సందర్బంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు సూర్య, జ్యోతిక. 
 

పూర్తి కథనం చదవండి

01:46 PM (IST) Apr 21

Breaking : విషాదం... 88 ఏళ్ళ వయసులో పోప్ ఫ్రాన్సిస్ మృతి

88 ఏళ్ల రోమన్ క్యాథలిక్ చర్చి అధిపతి పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూసారు. వాటికన్‌ సిటీలో ఆయన మరణాన్ని ధృవీకరించింది.

పూర్తి కథనం చదవండి

01:03 PM (IST) Apr 21

Copper: బంగారం కాదు, రాగి కొని పెట్టుకోండి.. మీ జీవితం మార‌డం ఖాయం. ఎందుకో తెలుసా.?

బంగారం ధ‌ర‌లు చుక్క‌లు చూపిస్తున్నాయి. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ధ‌ర‌లు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. రేపోమాపో తులం ల‌క్ష మార్క్ దాట‌డం ఖాయంగా ఉంది. ట్రంప్ సుంకాలు, డాల‌ర్ విలువ త‌గ్గ‌డం, కొన్ని దేశాల మ‌ధ్య నెల‌కొన్న యుద్ధ వాతావ‌ర‌ణం కార‌ణాలు ఏవైనా ప‌సిడి ప‌రుగులు పెడుతోంది. అయితే ఇలాంటి త‌రుణంలో బంగారంపై కంటే రాగిపై పెట్టుబ‌డులు పెట్ట‌డం ఉత్త‌మ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇంత‌కీ అలా చెప్ప‌డానికి కార‌ణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

12:38 PM (IST) Apr 21

AP DSC Crucial Tips: డీఎస్సీకి దరఖాస్తు చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే.. ఉద్యోగం రాదు!

AP DSC Crucial Tips: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ  ప్రక్రియ మే15వ తేద వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం అందరూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చేసే తప్పులు.. పెద్దపెద్ద ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. ఒక్కోసారి మంచి మార్కులు వచ్చినా ఉద్యోగం కూడా రాకపోయే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఏపీ విద్యాశాఖ ఎలాంటి జాగ్రత్తలు చెబుతుందో ఇప్పుడు చూద్దాం.. 
 

పూర్తి కథనం చదవండి

12:24 PM (IST) Apr 21

JD Vance పిల్లలు ఇండియన్స్ అనిపించుకున్నారు

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జె.డి. వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్, వాళ్ళ ముగ్గురు పిల్లలు సోమవారం ఉదయం భారతదేశంలో అడుగుపెట్టారు. పిల్లలు ముగ్గురూ భారతీయ దుస్తుల్లో కనిపించారు.

పూర్తి కథనం చదవండి

11:46 AM (IST) Apr 21

PM AC Yojana: ఉచితంగా ACల పంపిణీ.. కేంద్ర ప్ర‌భుత్వం కొత్త ప‌థ‌కంపై క్లారిటీ ఇదిగో

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా విస్తృతి ఓ రేంజ్‌లో పెరిగి పోయింది. ప్ర‌భుత్వాలు సైతం సోష‌ల్ మీడియా వేదిక‌గానే త‌మ ప‌థ‌కాల గురించి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాయి. అయితే సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వార్త‌ల‌న్నీ నిజ‌మేనా.? అంటే క‌చ్చితంగా అవునని స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. దీంతో నెట్టింట వైర‌ల్ అవుతోన్న కొన్ని వార్త‌ల‌పై మ‌ళ్లీ ప్ర‌భుత్వాలే క్లారిటీ ఇస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా నెట్టింట వైర‌ల్ అవుతోన్న ఓ వార్త‌పై ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో స్పందించింది.. 
 

పూర్తి కథనం చదవండి

11:07 AM (IST) Apr 21

ice ముఖానికి ఐస్ రాసుకుంటే ఎంత ప్రమాదమో తెలుసా?

చర్మానికి ఐస్:  అసలే ఎండాకాలం. బయట ఎండ వేడికి అస్సలు తట్టుకోలేకపోతున్నాం కదా. ఈ బాధ నుంచి తట్టుకోవడానికి అప్పుడప్పుడు ముఖానికి మంచుముక్కలు పెడుతుంటారు కొందరు. కానీ దీంతో కొన్ని సమస్యలు వస్తాయనే సంగతి మీకు తెలుసా? ముఖానికి ఐస్ రాసుకుంటే చల్లగా అనిపిస్తుంది, కానీ ఎక్కువగా వాడితే చర్మం కాలినట్టు అవుతుంది, పొడిబారుతుంది, మొటిమలు కూడా వస్తాయి. ఐస్ సరిగ్గా ఎలా వాడాలో తెలుసుకోండి.

పూర్తి కథనం చదవండి

11:04 AM (IST) Apr 21

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఢిల్లీ పర్యటన

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తన తొలి భారత పర్యటనకు ముందు, ఢిల్లీలోని పాలం విమానాశ్రయం, చాణక్యపురి వద్ద ఆయన చిత్రంతో కూడిన భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. వాన్స్ తన కుటుంబ సమేతంగా నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తున్నారు.

పూర్తి కథనం చదవండి

10:42 AM (IST) Apr 21

ఉప్పల్ స్టేడియంలో భారత మాజీ కెప్టెన్ కు హెచ్‌సీఏ షాక్.. హైకోర్టుకు అజారుద్దీన్.. అసలేంటి ఈ గొడవ?

HCA Mohammad Azharuddin Controversy: భారత్ తరఫున 99 టెస్టులు, 334 వన్డేలు ఆడిన మహ్మద్ అజారుద్దీన్ 2019 డిసెంబర్‌లో మాజీ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూర్చుని నార్త్ స్టాండ్‌కు తన పేరు పెట్టాలనే తీర్మానాన్ని ఆమోదించడంతో వివాదం మొదలైంది. 
 

పూర్తి కథనం చదవండి

10:41 AM (IST) Apr 21

JD Vance India Visit: భార‌త్‌లో ల్యాండ్ అయిన అమెరికా ఉపాధ్య‌క్షుడు.. మ‌రికాసేప‌ట్లో మోదీతో భేటీ

అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ 4 రోజుల భారత పర్యటనలో భాగంగా కాసేపటి క్రితమే ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి

10:30 AM (IST) Apr 21

JD Vance: ఆంధ్రా అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడు.. వాన్స్‌ భార్య అచ్చ తెలుగమ్మాయి!

JD Vance Visits India: అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇండియాకు చేరుకున్నాడు. ఈరోజు ఉదయం 10 గంటలకు జేడీ వాన్స్‌ తన సతీమణి ఉషాతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ, అమిత్‌ షా, తదితర నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇటీవల ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు, సుంకాలు, టారిఫ్‌లు, ఆర్థిక, వాణిజ్యం, భౌగోళిక సంబంధాలపై జేడీతో మోదీ చర్చించే అవకాశం ఉంది. ఈ చర్చలతో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. అయితే.. జేడీ వ్యాన్స్‌ భార్య ఉషా తెలుగమ్యాయి.. ఈ వార్త ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. 
 

పూర్తి కథనం చదవండి

10:18 AM (IST) Apr 21

JD vance India Visit: అమెరికా ఉపాధ్య‌క్షుడు భార‌త్ ఎందుకొస్తున్నారు.? దీంతో మ‌న‌కు జ‌రిగేది ఏంటి?

అమెరికా ఉపరాష్ట్రపతి జేడీ వాన్స్ తన భార్య ఉషా, ముగ్గురు పిల్లలతో సోమవారం ఉదయం ఢిల్లీలో అడుగుపెట్టారు. ఇది అధికారిక పర్యటన అయినా, వ్యక్తిగతంగా కూడా ఎంతో ప్రత్యేకం. ఉషా వాన్స్ భారత సంతతి వ్యక్తి, అందులోని తెలుగు మ‌హిళ కావ‌డం ఈ ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇంత‌కీ జేడీ వాన్స్ భార‌త్ ఎందుకు వ‌స్తున్నారు.? దీంతో మ‌న‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

09:48 AM (IST) Apr 21

Weather report: తెలంగాణలో భారీ వర్షం.. 16 జిల్లాలను అలర్ట్ చేసిన అధికారులు

ఓవైపు ఎండ తీవ్రత మరో వైపు వర్షాలతో ఏపీ, తెలంగాణలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఉద‌యం భ‌రించ‌లేని ఉక్క‌పోత ఉంటోంది, సాయంత్రం కాగానే వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డుతుంది. భారీ ఇద‌రుగు గాలుల‌తో కూడిన వ‌ర్షం ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా వాతావ‌ర‌ణ శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణ‌లో పలు చోట్ల వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. ఇంత‌కీ ఏయే జిల్లాల్లో వ‌ర్షం ప‌డ‌నుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

More Trending News