88 ఏళ్ల రోమన్ క్యాథలిక్ చర్చి అధిపతి పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూసారు. వాటికన్‌ సిటీ ఆయన మరణాన్ని ధృవీకరించింది.

Pope Francis died : రోమన్ క్యాథలిక్ చర్చి అధిపతి, యావత్ ప్రపంచ ఎంతో గౌరవించే పోప్ ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వాటికన్ సిటీ కామెర్లెంగో కార్డినల్ కెవిన్ ఫారెల్ ఈ ప్రకటన చేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:35 గంటలకు పోప్ ప్రశాంతంగా కన్నుమూశారని వాటికన్ ధృవీకరించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
Scroll to load tweet…

అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో జన్మించిన జార్జ్ మారియో బెర్గోగ్లియో 2013లో పోప్ ఫ్రాన్సిస్‌గా ఎన్నికైనప్పుడు చరిత్ర సృష్టించారు. 1,200 కాలంలో యూరప్ నుండి కాకుండా మరో దేశం నుండి ఎంపికయిన మొదటి పోప్ ఈయనే. ఆయన అత్యున్నత అభిప్రాయాలకు, పేదలు, అట్టడుగు వర్గాల పట్ల అంకితభావానికి, వాటికన్‌ను సంస్కరించాలనే తన నిబద్ధతకు పేరుగాంచిన పోప్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చి లోపల, వెలుపల ఒక పరివర్తన చెందిన నాయకుడిగా మారారు.

పదేళ్లకు పైగా పోప్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన అనేక గొప్ప సంభాషణలు చేసారు.. వాతావరణ చర్యపై బలమైన వైఖరి తీసుకున్నారు, శరణార్థులు, వలసదారుల హక్కుల కోసం వాదించారు. చర్చిలోని సంప్రదాయవాద వర్గాల నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నప్పటికీ మరింత సమ్మిళిత, కరుణాత్మక విశ్వాసాన్ని ప్రోత్సహించడంలో ఆయన దృఢంగా ఉన్నారు.

సెడే వేకంటే (పోప్‌ల మధ్య కాలం) సమయంలో చర్చి వ్యవహారాలను కామెర్లెంగోగా పనిచేస్తున్న కార్డినల్ కెవిన్ ఫారెల్ చూసుకుంటారు. తదుపరి సమావేశానికి సన్నాహాలు ప్రారంభమైనందున ఆయన కీలక విధులను నిర్వహిస్తారు.

ప్రపంచ నాయకులు, మత ప్రముఖులు, కోట్లాదిమంది భక్తులు పోప్ కు నివాళులు అర్పిస్తారు. వాటికన్ త్వరలో పోప్ అంత్యక్రియలు, అధికారిక సంతాప వివరాలను విడుదల చేయనుంది.