ఉత్త‌ర ప్ర‌దేశ్ లో దారుణం.. బ‌ల‌వంతంగా మ‌తం మార్చి, పెళ్లి చేసుకొని యువ‌తిపై గ్యాంగ్ రేప్..

By Sumanth KanukulaFirst Published Jul 2, 2022, 1:27 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువతిని ఓ దుండగుడు కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మార్చారు. అనంతరం ఆమెపై మరి కొందరితో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో దారుణం జ‌రిగింది. బ‌ల‌వంతంగా 23 ఏళ్ల యువ‌తిని మ‌తం మార్చి పెళ్లి చేసుకున్నాడు ఓ దుండ‌గుడు. అనంత‌రం ఆమెపై మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తుల‌తో క‌లిసి సామూహికంగా అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది. ఈ విష‌యంలో బాధితురాలి తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 

Fourth Covid Wave? 24 గంటల్లో 17వేలకు పైగా కొత్త కేసులు.. 29 మంది మ‌ృతి

బాధితురాలి తండ్రి ఫిర్యాదు ప్ర‌కారం ఎస్పీ సంతోష్ కుమార్ మిశ్రా తెలిపిన వివ‌రాల వెల్ల‌డించారు. యూపీలోని గోండా జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువ‌తి అప్పుడ‌ప్పుడు జావేద్ అనే వ్య‌క్తితో ఫోన్ లో మాట్లాడేది. అయితే జూన్ 14వ తేదీన ఆమెకు జావేద్ సోద‌రుడు కిడ్నాప్ చేశాడు. అనంత‌రం ఆమెకు మ‌త్తు మందు ఇచ్చి ముంబై తీసుకెళ్లాడు.

బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యశ్వంత్ సిన్హా.. స్వాగతం పలికిన సీఎం కేసీఆర్..

ముంబై లో ఆమెను జావేద్ గదిలో బంధించాడు. బలవంతంగా మతం మార్చుకుని పెళ్లి చేసుకున్నాడు. అనంత‌రం జావేద్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. ఇలా ప‌లు మార్లు త‌న కుమార్తెపై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడ‌ని బాధితురాలి తంండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. జూన్ 23న జావేద్ తన కూతురిని కల్నల్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో దింపాడని, ఈ ఘ‌ట‌న‌ను ఎవ‌రికీ చెప్పొద్ద‌ని బెరించాడ‌ని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేర‌కు నలుగురు నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిట‌ల్ కు పంపించిన‌ట్టు ఇన్‌స్పెక్టర్ ఇన్‌ఛార్జ్ షంషేర్ బహదూర్ సింగ్ తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

రేపు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న యోగి ఆదిత్యనాథ్.. భారీగా భద్రత ఏర్పాట్లు..

కాగా.. గత నెల 11వ తేదీన రాజస్థాన్ లో 12 ఏళ్ల మైన‌ర్ పై కొంద‌రు దుండ‌గులు సామూహికంగా అత్యాచారానికి పాల్ప‌డిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఆమెను తుపాకీతో బెదిరించి మ‌రీ ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు. ఆ రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మే 13వ తేదీన ఇద్దరు వ్యక్తులు మైన‌ర్ ను అడవిలోకి లాక్కెళ్లారు. అక్క‌డ ఆమెను తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అయితే బాలిక త‌ల్లిదండ్రులు ఆమె కోసం గాలించ‌గా.. తెల్ల‌వారు జామున అడవిలో గుర్తించారు. దీనిపై త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 

click me!