2014 తరువాత దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు, మెడికల్ కాలేజీలు పెరిగాయి - ప్రధాని నరేంద్ర మోడీ

Published : Dec 24, 2022, 02:04 PM IST
2014 తరువాత దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు, మెడికల్ కాలేజీలు పెరిగాయి - ప్రధాని నరేంద్ర మోడీ

సారాంశం

2014 తరువాత భారత్ లో ఐఐటీలు, ఐఐఎంలు, మెడికల్ కాలేజీలు గణనీయంగా పెరిగాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని నూతన జాతీయ విద్యావిధానం రూపొందిందని తెలిపారు.   

నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) ద్వారా దేశంలోనే తొలిసారిగా దార్శనికతతో కూడిన, భవిష్యత్తు ఆధారిత విద్యా వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రాజ్‌కోట్‌లోని స్వామినారాయణ గురుకుల 75వ ‘అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఇందులో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ పాల్గొని ప్రసంగించారు.

క‌రోనా డెంజ‌ర్ బెల్స్: ఆక్సిజ‌న్ ల‌భ్య‌త‌పై స‌మీక్ష‌లు చేయండి.. రాష్ట్రాల‌కు కేంద్రం మ‌రో లేఖ

2014 తర్వాత దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు, వైద్య కళాశాలల సంఖ్య గణనీయంగా పెరిగాయని అన్నారు. “భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తును అందించడానికి మా ప్రస్తుత విద్యా విధానం, సంస్థలు పెద్ద పాత్ర పోషిస్తాయని మీకు బాగా తెలుసు. ఈ స్వాతంత్ర్య 'అమృత్‌కాల్'లో విద్యా మౌలిక సదుపాయాల్లో, విద్యా విధానంలో మేము పాలుపంచుకుంటాము. మేము ప్రతి స్థాయిలో పని చేస్తున్నాము.’’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నేడు దేశంలో ఐఐటీలు, ఐఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ వంటి పెద్ద విద్యాసంస్థల సంఖ్య పెరుగుతోందని ప్రధాని తెలిపారు. 2014 తర్వాత దేశంలో మెడికల్ కాలేజీలు 65 శాతానికి పైగా పెరిగాయని అన్నారు. 

ఇటీవల సెంట్రల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా నూతన జాతీయ విద్యా విధానంపై వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 28వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లోని ఠాకుర్‌ ద్వార్‌లోని కృష్ణ మహావిద్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. విద్యా, జీవనోపాధి అవకాశాల నుండి డిగ్రీని డీ-లింక్ చేయడమే ఎన్ఈపీ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. భారతదేశంలోని విద్యార్థులు, యువతకు కొత్త కెరీర్, వ్యవస్థాపక అవకాశాలను అందిస్తుందని అన్నారు.

దారుణం.. స్డూడెంట్ పై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు. అరెస్టు చేసిన పోలీసులు.. ఎక్కడంటే ?

ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన ఎన్ఈపీ-2020 ప్రపంచ ప్రమాణాల ప్రకారం భారతదేశ విద్యా విధానాన్ని తిరిగి మారుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్వాతంత్య్రానంతరం భారతదేశంలోని అతిపెద్ద సంస్కరణగా దీనిని కేంద్ర మంత్రి అభివర్ణించారు. కొత్త విధానం ప్రగతిశీలమైనదని, దూరదృష్టితో కూడుకున్నదని అన్నారు. ఇది మాత్రమే కాకుండా అభివృద్ధి చెందుతున్న 21వ శతాబ్దపు భారత అవసరాలకు అనుగుణంగా ఉందని తెలిపారు.

చైనా స‌హా మ‌రో 4 దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి.. : కేంద్రం

కేవలం డిగ్రీలపైనే దృష్టి పెట్టకుండా విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభ, పరిజ్ఞానం, నైపుణ్యం, ప్రతిభకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని జితేంద్ర సింగ్ అన్నారు. డిగ్రీలను విద్యతో అనుసంధానం చేయడం వల్ల మన విద్యావ్యవస్థ, సమాజానికి కూడా తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. విద్యావంతులైన నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త జాతీయ విద్యా విధానంలో బహుళ ప్రవేశ, నిష్క్రమణ ఎంపికల కోసం నిబంధనలు ఉన్నాయని అన్నారు. దీని వల్ల విద్యార్థులకు విద్యాపరమైన సౌలభ్యం కలుగుతుందని హామీ ఇచ్చారు. ఇది వారి అంతర్గత అభ్యాసం, స్వాభావిక ప్రతిభను బట్టి వివిధ సమయాల్లో కెరీర్ అవకాశాలను పొందేందుకు సంబంధించిన విద్యార్థులపై సానుకూల ప్రభావం చూపుతుందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Sia Goyal Case: కేతన్ అగర్వాల్ హత్య జరిగిన స్పాట్ ఇదే సుమారు 400 అడుగుల ఎత్తు నుంచి | Asianet Telugu
చెన్నైలో చిన్నారులకు పోలియో వేసిన సీఎం విజయ్ | CM Vijay Launches National Pulse Polio