సారాంశం

New Delhi: ప్రపంచవ్యాప్త కోవిడ్-19 ఉప్పెన నేపథ్యంలో చైనా, జపాన్, సౌత్ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్ నుండి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రభుత్వం RT-PCR పరీక్షలను (కోవిడ్-19 ప‌రీక్ష‌లు) తప్పనిసరి చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం కోవిడ్-19 ఉప్పెన‌కు కార‌ణ‌మైన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భార‌త్ లోనూ వెలుగుచూడ‌టంతో కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది.

Covid-19 Tests: ప్ర‌పంచంలోని ప‌లు దేశాల్లో మ‌ళ్లీ క‌రోనావైర‌స్ బారిన‌ప‌డుతున్న కొత్త వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతుండ‌టంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం కోవిడ్-19 ఉప్పెన‌కు కార‌ణ‌మైన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భార‌త్ లోనూ వెలుగుచూడ‌టంతో కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను సైతం అల‌ర్ట్ చేస్తూ క‌రోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్రభుత్వం అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌కు సంబంధించి మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు కోవిడ్-19 ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున, చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్ నుండి వ‌చ్చే అంతర్జాతీయ ప్ర‌యాణికుల‌కు RT-PCR ప‌రీక్ష‌లు తప్పనిసరి అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. రాగానే, ఈ దేశాల నుండి ప్రయాణీకులెవరైనా రోగలక్షణంగా గుర్తించబడితే లేదా కోవిడ్‌కు పాజిటివ్ అని తేలితే, అతన్ని లేదా ఆమెను క్వారంటైన్‌లో ఉంచుతారని ఆయన చెప్పారు.

చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్ మరియు థాయ్‌లాండ్ నుండి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు ప్రస్తుత ఆరోగ్య స్థితిని ప్రకటించడానికి ఎయిర్ సువిధ ఫారమ్ నింపడం తప్పనిసరి అని కేంద్రం పేర్కొందని వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది.

 

Covid19 | Air Suvidha form filling to declare current health status to be made compulsory for international passengers arriving from China, Japan, South Korea, Hong Kong and Thailand pic.twitter.com/tX4Yrr6j4U

— ANI (@ANI) December 24, 2022

 

ఇదిలావుండగా, పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. కరోనా కట్టడి చర్యలను వేగవంత చేయాలని సూచిస్తోంది.పొరుగున ఉన్న చైనాతో సహా పలు దేశాల్లో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మాస్కులు, జీనోమ్ సీక్వెన్సింగ్, విమానాశ్రయాలలో యాదృచ్ఛిక పరీక్షలపై దృష్టి సారించడంతో భారతదేశంలో కోవిడ్ -19 పై కొత్త  చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కేంద్ర వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. కరోనా కట్టడి చర్యలను వేగవంత చేయాలని సూచిస్తోంది. ప్రస్తుతం దేశంలో మూడు వేలకు పైగా కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇత‌ర దేశాల్లో క‌రోనా వ్యాప్తికి అధికంగా కార‌ణ‌మ‌వుతున్న క‌రోనా వైర‌స్ కొత్త ఒమిక్రాన్ వేరియంట్లు భార‌త్ లోనూ వెలుగుచూసిన త‌ర్వాత‌ ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్కడ మహమ్మారి ఇంకా ముగియలేదని పునరుద్ఘాటించారు. ప్రస్తుత నిఘా చర్యలను పెంచాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయాలలో. కోవిడ్ -19 పరీక్ష, జన్యుక్రమాన్ని పెంచాలని, ముఖ్యంగా సెలవు సీజన్ సమీపిస్తున్నందున అన్ని సమయాల్లో కోవిడ్-తగిన ప్రవర్తనను పాటించాలని ఆయన ప్రజలను కోరారు. కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాలు త‌ప్ప‌కుండా పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు.