ప్రియుడితో కలిసి బిడ్డ హత్య.. మహిళకు 17ఏళ్ల జైలు శిక్ష

By telugu news teamFirst Published Apr 2, 2021, 3:15 PM IST
Highlights

వీరి రాసలీలీలకు బిడ్డ అడ్డుగా ఉన్నందున తరచుగా అతన్ని కొట్టి హింసించేవారు. గత 2015లో బిడ్డతో కృష్ణగిరి చేరుకోగా అక్కడ బిడ్డ మృతిచెందాడు. 

ప్రియుడితో కలిసి ఓ మహిళ  కన్న బిడ్డను హత్య చేసింది. కాగా.. ఆమె చేసిన నేరం రుజువు కావడంతో..  సదరు మహిళను 17ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శివగంగై జిల్లా ఇలయాంగుడికి చెందిన శివానందం. సైనికుడు. ఇతని భార్య వనిత (29). వీరి కుమారుడు నందీస్‌కుమార్‌ (4). ఇలావుండగా వనితకు అదే ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్‌ కార్తిక్‌రాజాతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వారు బిడ్డతో ఆంధ్ర రాష్ట్రం తిరుపతికి వెళ్లి అద్దె ఇంట్లో నివసించసాగారు. వీరి రాసలీలీలకు బిడ్డ అడ్డుగా ఉన్నందున తరచుగా అతన్ని కొట్టి హింసించేవారు. గత 2015లో బిడ్డతో కృష్ణగిరి చేరుకోగా అక్కడ బిడ్డ మృతిచెందాడు. కృష్ణగిరిలో బిడ్డను పాతిపెట్టి ఇరువురూ తిరుపతి చేరుకున్నారు.

వీరు అద్దెకుంటున్న ఇంటి యజమాని బిడ్డ ఎక్కడని ప్రశ్నించగా ఆరోగ్యం సరిలేనందున తమ ఊరిలోనే వదిలిపెట్టినట్లు తెలిపారు. దీంతో అనుమానించిన అతను తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి వద్ద విచారణ జరపగా బిడ్డను హతమార్చినట్లు ఒప్పుకున్నారు. దీంతో కార్తిక్‌రాజా, వనితను పోలీసులు అరెస్టు చేశారు.

 ఆ తర్వాత వారు కోర్టులో బెయిలు పొంది విడుదలయ్యారు. ఆ తర్వాత కార్తిక్‌ రాజా అదృశ్యమయ్యాడు. ఈ కేసులో బుధవారం న్యాయమూర్తి కలైమది తీర్పునిచ్చారు. ఇందులో ప్రియుడితో కలిసి బిడ్డను హతమార్చిన వనితకు 17 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. కార్తిక్‌రాజా కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

click me!