ఒలింపిక్స్లో భారత్కి రెండు మెడల్స్ అందించిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్పై డిసెంబర్ 4న హత్యకేసు నమోదైంది. ఢిల్లీలో ఛత్రపాల్ స్టేడియంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో యువ రెజ్లర్ సాగర్ రాణా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
undefined
పోలీస్ కానిస్టేబుల్ కొడుకైన 23 ఏళ్ల సాగర్ రాణాపై రెండు రౌండ్ల కాల్పులు జరిగినట్టు తేల్చారు పోలీసులు. ఈ హత్య జరిగిన సమయంలో సుశీల్ కుమార్ అక్కడే ఉండడంతో పాటు హత్యకు ఉసిగొల్పాడని ఆరోపణలు ఉన్నాయి.
undefined
సుశీల్ కుమార్పై హత్యానేరం కేసు నమోదుచేసిన పోలీసులు, అతని కోసం దాదాపు 19 రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సుశీల్ కుమార్ ఎక్కడ ఉన్నది సమాచారం తెలియకపోవడంతో ఈ నెల 18న నాన్బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి, సమాచారం అందించిన వారికి రూ. లక్ష రివార్డు అందిస్తామని తెలిపారు.
undefined
సుశీల్ కుమార్తో పాటు హత్యకేసులో సంబంధం ఉన్నట్టుగా అనుమానిస్తున్న అతని అసోసియేట్ అజయ్ కుమార్ జాడ తెలియచేసినవారికి బహుమతిగా రూ.50 వేల రివార్డు ఇస్తామని తెలిపారు. దీంతో జనాల నుంచి పోలీసులకు సమాచారం అందించింది. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ సమీపంలో సుశీల్ కుమార్ కారులో వెళ్తున్నామని సమాచారం అందుకున్న పోలీసులు, అతన్ని ముడ్గల్ ఏరియాలో అరెస్ట్ చేశారు.
undefined
2008లో బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన సుశీల్ కుమార్, 2012లో రజత పతకం సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. ‘రాజీవ్ ఖేల్రత్న’తో పాటు ‘అర్జున’ అవార్డు కూడా సొంతం చేసుకున్న సుశీల్ కుమార్పై హత్యకేసు నమోదుకావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
undefined
రెజ్లింగ్తో సత్తా చాటిన సుశీల్ కుమార్కి భారత రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఛత్రపాల్ స్టేడియంలో స్పెషల్ డ్యూటీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న సమయలో ఇరువర్గాల మధ్యగొడవ జరిగి సాగర్ మరణానికి కారణమైంది.
undefined