అయ్యప్పస్వామి గురించి మీకు ఈ విషయం తెలుసా?

First Published Dec 19, 2023, 3:58 PM IST

Sabarimala: శబరిమల ఆలయం అయ్యప్పస్వామికి అంకితం చేయబడింది. అయితే యువరాజు మణికందన్ నే అయ్యప్పస్వామిగా అవతారమెత్తారని నమ్ముతారు. 
 

sabarimala

Sabarimala: శబరిమల కేరళలోని పతనంతిట్ట జిల్లాలో కొండపై  ఉంటుంది. ఈ పవిత్రమైన ఆలయం చుట్టూ అందమైన 18 కొండలు ఉన్నాయి. ఈ ఆలయం దేవుడు అయ్యప్పస్వామికి అంకితం చేయబడింది. ఇక్కడకు వెళ్లిన భక్తుల కోరికలు ఖచ్చితంగా తీరుతాయనే నమ్మకం ఉంది. అందుకే ఈ ఆలయానికి ప్రతి ఏడాది కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటుగా ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు సందర్శిస్తుంటారు. ఈ ఆలయాన్ని నవంబరు నుంచి డిసెంబరు వరకు సందర్శించొచ్చు. ఈ సమయంలో మండలపూజ ఉంటుంది. అలాగే జనవరి 14న అంటే మకర సంక్రాంతి, ఏప్రిల్ 14న అంటే మహాశివ సంక్రాంతి, ప్రతి మలయాళ మాసంలో మొదటి ఐదు రోజులు మాత్రమే అయ్యప్పస్వామికి పూజలు చేసేందుకు ఆలయాన్ని తెరుస్తారు. 


దేశంలో ఉన్న పురాతన ఆలయాల్లో శబరిమల ఒకటి. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే? ఈ ఆలయం స్థాపించిన తర్వాత మూడు శతాబ్దాల వరకు.. ఈ ఆలయం గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు. అయితే 12 వ శతాబ్దంలో.. మణికందన్ అనే రాజకుమారుడు శబరిమల ఆలయానికి మర్గాన్ని కనుగొన్నాడు. ఈ రాజకుమారుడు పండలం రాజవంశానికి చెందినవాడు. మీకు తెలిసే ఉంటుంది.. శబరిమలకు వెళ్లినప్పుడు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ముందు వావర్ ను దర్శించుకుంటారు. ఈ వావర్ మణికందన్ ను ఓడించిన ముస్లిం యోధుడు. కానీ ఈ వావర్ మణికందన్ ను ఎంతో సాయం చేశాడు. అలాగే ఇతను మణికందన్ కు గొప్ప భక్తుడయ్యాడు. అయితే మణికందన్ ఈ  అలయంలో ధ్యానం చేసి దైవంతో ఒక్కటయ్యాడని నమ్ముతారు. అందుకే ఈ యువరాజును అయ్యప్ప అవతారంగా భావిస్తారు. 
 

అయ్యప్పస్వామికి ఎంతో మంది భక్తులున్నారు. అందుకే ఈయన అనుగ్రహం కోసం ప్రతీ ఏడాది ఎంతో మంది అయ్యప్పస్వామి మాల వేస్తారు. వీళ్లు శబరిమలకు వెళ్లే ముందు 41 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటిస్తారు. అలాగే ఆల్కహాల్ కు దూరంగా ఉంటారు. అసభ్యకరమైన మాటలు మాట్లాడరు. అంతేకాదు గోర్లను, జుట్టును కత్తిరించరు. అయ్యప్పమాల ఏసిన వారు రోజుకు రెండు సార్లు స్నానం చేసి స్థానిక ఆలయాలలకు వెళ్లి అయ్యప్పస్వామిని పూజిస్తారు. 

అయ్యప్పమాల వేసిన వారు  కేవలం నలుపు లేదా నీలం రంగు దుస్తులనే మాత్రమే ధరిస్తారు. శబరిమలకు వెళ్లే వరకు తలస్నానం అసలే చేయరు. అలాగే ఖచ్చితంగా నుదుటిపై విభూతి లేదా చందనాన్ని పెట్టుకుంటారు. 

ప్రతి సంవత్సరం కులమతాలకు అతీతంగా లక్షల మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు పూలదండలు, ఇరుముడిలతో, అయ్యప్ప స్వామికి పాదాభిషేకం చేస్తారు. అలాగే పవిత్ర నది పంపాలో స్నానమాచరిస్తారు. అలాగే పద్దెనిమిది మెట్లు ఎక్కి ధర్మశాస్త్రమైన అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు.

click me!