పెంపుడు పిల్లి చిలిపి పని... యజమాని ఏం చేసిందో తెలుసా?

First Published Aug 19, 2020, 2:36 PM IST

ఓ మహిళ పెంచుకున్న పిల్లి కూడా అలానే చేసిందట. అయితే.. పాలు, పెరుగులాంటివి కాకుండా.. ఓ వస్తువుని దొంగలించిందట. 

ఇంట్లో పిల్లులు, కుక్కలను చాలా మంది పెంచుకుంటారు. అయితే.. మన ఇంట్లో పిల్లి.. పక్కింట్లోకి వెళ్లి పాలు, పెరుగులాంటివి తినడం లాంటివి చేస్తూ ఉంటాయి. అయితే.. ఓ మహిళ పెంచుకున్న పిల్లి కూడా అలానే చేసిందట. అయితే.. పాలు, పెరుగులాంటివి కాకుండా.. ఓ వస్తువుని దొంగలించిందట. దీంతో.. ఆమె ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆమె చేసిందో తెలుసుకోవాలని ఉందా.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..
undefined
పెనస్లేవియా ప్రాంతానికి చెందిన బీజే రోజ్ అనే మహిళ కి ఓ పెంపుడు పిల్లి ఉంది. దాని పేరు జోర్దన్.
undefined
సాధారణంగా పిల్లులు.. పాలు, చేపలు లాంటివి దొంగతనం చేస్తాయి. అయితే.. ఈ పిల్లికి మాత్రం షూస్ దొంగతనం చేయడం అలవాటు అంట.
undefined
ఆ పిల్లి.. మొదట్లో చనిపోయిన పక్షులు, ఎలుకలు, పాములు లాంటివి పట్టుకొచ్చుకొని ఇంట్లో తినేదట. తర్వాత వాటిని తీసుకురావడం మానేసిందట.
undefined
త తర్వాత కొద్ది రోజులకు వాళ్ల ఇంటి ముందు ఎవరిదో షూ కనపడిందట. ఎవరిదోలే అని ఆమె లైట్ తీసుకుందట. ఆ తర్వాత రోజు కో కొత్త రకం షూలు దర్శనమిస్తూ వచ్చాయట.
undefined
ఇది ఎవరి పనా అని తెలుసుకోవడానికి ఆమె సీసీ కెమేరా ఏర్పాటు చేసింది. అందులో చూశాక అర్థమయ్యిందేమింటంటే.. తన పిల్లి ఆ షూస్ దొంగ అని.
undefined
అయితే.. రోజు రోజుకీ ఆమె ఇంటి వద్ద షూస్ పెరిగిపోతున్నాయట.దాదాపు 40 జతల షూస్ తీసుకువచ్చింది. దీంతో.. ఆమెకు తానేదో పెద్ద తప్పు చేసిన భావన కలిగిందంట. వెంటనే.. ఎవరి షూస్ వాళ్లకి ఇచ్చేయాలని అనుకుంది.
undefined
అందుకోసం.. ఓ ఫేస్ బుక్ గ్రూప్ ఒకటి ఆమె క్రియేట్ చేసింది. అందులో.. తమ పిల్లి ఎత్తుకువచ్చిన షూస్ ఫోటోలు తీసి అందులో పోస్టు చేయడం మొదలుపెట్టింది.
undefined
కాగా.. ఇప్పుడు ఆ గ్రూప్ లో చాలా మంది చేరారట. ఆ షూస్ ని గుర్తుపట్టి చాలా మంది వాళ్ల షూస్ తీసుకువెళ్లిపోయారట. కాగా.. తమ పిల్లి జోర్దన్ కి ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారట.
undefined
click me!