అనంత్ అంబానీ పెళ్లి ఎక్కడ జరుగుతుందో.. ఖర్చెంతో తెలుసా..?

First Published May 21, 2024, 4:39 PM IST

ఈ పెళ్లి కి ఎంత ఖర్చ పెడుతున్నారో.. ఎంత మంది అతిథులు ఈ పెళ్లికి హాజరుకానున్నారు అనే విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

ప్రముఖ వ్యాపారవేత్త, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు అయిన ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు దగ్గరపడుతున్నాయి. రీసెంట్ గా.. వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకను రీసెంట్ గా చాలా గ్రాండ్ గా  చేశారు. ఇక ఇప్పుడు పెళ్లి వేడుకలను మొదలుపెట్టారు. 
 

అనంత్ అంబానీ.. తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్ ని పెళ్లాడుతున్న విషయం తెలిసిందే. గతేడాది జనవరిలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది.  తర్వాత.. ఈ ఏడాది మేలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు.  ఇక.. అసలు సిసలైన పెళ్లి జులైలో జరగనుంది.

కాగా.. ఈ పెళ్లి కి ఎంత ఖర్చ పెడుతున్నారో.. ఎంత మంది అతిథులు ఈ పెళ్లికి హాజరుకానున్నారు అనే విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
 


ప్రస్తుత  సమాచారం ప్రకారం ఈ ఈవెంట్‌లో దాదాపు 800 మంది అతిధులు పాల్గొంటారని, ఈ ఈవెంట్‌ని ఒకే చోట కాకుండా ఇటలీ నుంచి బయల్దేరి భారీ లగ్జరీ షిప్‌లో ఆనంద్ అంబానీ వివాహ వేడుక జరగనుందని కొంత సమాచారం. 

ఓడలో అతిథులను అలరించడానికి దాదాపు 600 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు ఈ లగ్జరీ షిప్ 4380 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కూడా చెబుతున్నారు. ఇందుకోసం అంబానీ ఫ్యామిలీ రకరకాల ఏర్పాట్లు చేస్తోందని చెప్పొచ్చు.
 

గత మార్చిలో జామ్‌నగర్‌లో జరిగిన వివాహ వేడుకలో ఇప్పటికే వివిధ ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఆహారం కోసమే దాదాపు 300 కోట్లు ఖర్చు చేశారు. ఇక ఈ పెళ్లికి ఇప్పటి వరకు దాదాపు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం.
 


ముకేశ్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ వివాహం జూలై 12న జరగనుంది. మరి.. ఈ సారి కూడా బాలీవుడ్ అగ్రతారలంతా వెళ్లి ఆ వేడుకల్లో సందడి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Latest Videos

click me!