కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం కొన్ని వాహనాలకు టోల్ ట్యాక్స్ ఉండదు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలకు టోల్ లేదు. అంబులెన్స్, ఫైర్ ఇంజన్ లాంటి వాహనాలకు కూడా టోల్ ఉండదు. సైనిక వాహనాలు, రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు, ఎంపీలు, హైకోర్టు జడ్జీలు వాడే వాహనాలకు టోల్ ఉండదు. పరమవీర చక్ర, అశోక చక్ర లాంటి అవార్డులు పొందిన వారికి, ప్రభుత్వ బస్సులకు కూడా టోల్ వసూలు చేయరు. ఇందులో ప్రభుత్వ బస్సులంటే అద్దె బస్సులు కావు. కేవలం ప్రభుత్వం అండర్ లో నడిచే బస్సులకు మాత్రమే టోల్ ఉండదు.