Samantha: సమంత ఒంటిపై బ్లౌజ్ ఉన్నా లేనట్లే... ఉల్లిపొరలాంటి చీరలో యద అందాల విందు!

First Published Mar 25, 2023, 6:25 PM IST

సమంత లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. డిజైనర్ శారీ ధరించిన ఈ స్టార్ లేడీ క్లీవేజ్ అందాలు చూపుతూ గుండెల్లో గుబులు రేపారు. 
 

సమంత శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రెస్ మీట్ కి డిజైనర్ శారీ ధరించి హాజరయ్యారు. డీప్ నెక్ జాకెట్ లో సమంత క్లీవేజ్ షోతో మంట పుట్టించారు. అసలు సమంత ఒంటిపై బ్లౌజ్ ఉందా లేదా అన్నట్లుండగా అభిమానుల మతులు గతి తప్పుతున్నాయి.

సమంత కెరీర్ లో మొదటిసారి పౌరాణిక చిత్రం చేశారు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం చిత్రంలో ఆమె విశ్వామిత్ర మహర్షి కూతురు శకుంతలగా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్న శాకుంతలం ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. దీంతో శాకుంతలం చిత్రాన్ని సమంత భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ మూవీని సక్సెస్ చేసే బాధ్యత సమంత తీసుకున్నారు.

నేడు జరిగిన శాకుంతలం చిత్ర ప్రెస్ మీట్లో సమంత అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  శాకుంతలం చిత్రాన్ని మొదట సున్నితంగా తిరస్కరించాను అన్నారు. అయితే గుణశేఖర్ నన్ను ఒప్పించారు. శాకుంతలం వదులుకుంటే గొప్ప చిత్రంలో నటించే అవకాశం కోల్పోయేదాన్ని అంటూ ఆమె చెప్పుకొచ్చారు. 
 

అలాగే తనకు సోకిన మయోసైటిస్ వ్యాధి గురించి మాట్లాడారు. ప్రస్తుత హెల్త్ కండిషన్ వివరించారు. వ్యాధి సోకిన కొత్తలో చాలా నీరసంగా ఉండేది. చికిత్స తర్వాత కొంత కోలుకున్నాను. ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగైంది. పూర్తిగా బయటపడతానన్న ధైర్యం కలుగుతుంది అంటూ సమంత చెప్పుకొచ్చారు.  
 

మరోవైపు వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్లో సమంత పాల్గొంటున్నారు. ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో జరిగింది. అనంతరం నార్త్ ఇండియాలో చిత్రీకరణ జరిపారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నైనిటాల్ లో సిటాడెల్ కి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. నెక్స్ట్ షెడ్యూల్ విదేశాల్లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సౌత్ ఆఫ్రికాతో పాటు పలు దేశాల్లో సిటాడెల్ షూట్ జరపనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు.
 


 అలాగే విజయ్ దేవరకొండకు జంటగా నటిస్తున్న ఖుషి చిత్ర చిత్రీకరణ తిరిగి మొదలైంది. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇక దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో సమంత పాల్గొంటున్నారు.

click me!