లంగా వోణీ నేటితో రద్దై పోని.. పల్లెటూరి పిల్లలా మురిసిపోతున్న `ఢీ` భామ ప్రియమణి.. ఆ వయ్యారాలు చూడాలి..

First Published Aug 25, 2021, 10:42 AM IST

`ఢీ` బ్యూటీ ప్రియమణి సందడి అంతా ఇంతా కాదు. యంగ్‌ హీరోయిన్లకు పోటీనిస్తూ ఓవైపు హీరోయిన్‌గా, మరోవైపు ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌ మాధ్యమాల్లోనూ సత్తా చాటుతుంది. అప్‌కమింగ్‌ హీరోయిన్లకి ఆదర్శంగా నిలుస్తుంది. 

ప్రియమణి ప్రస్తుతం సినిమాలతోపాటు టీవీ షోస్‌లోనూ మెరుస్తుంది. అందులో భాగంగా `ఢీ` డాన్స్ షోలో మెరుస్తుంది. జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఇందులో ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదని చెప్పొచ్చు. 

అయితే ఈ సారి చాలా స్పెషల్‌గా రాబోతుంది ప్రియమణి. పల్లెటూరి స్పెషల్‌గా లంగావోణిలో కనువిందు చేశారు. కలర్‌ఫుల్‌ బ్లౌజ్‌, పింక్‌ లంగా, వైట్‌ వోణిలో మెరిసింది ప్రియమణి. 
 

ఇందులో సిగ్గులొలికిస్తూ ప్రియమణి ఇచ్చిన పోజులు నెట్టింటి ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

ఈ సందర్భంగా ప్రియమణి పంచుకున్న నోట్‌ ఆలోచింప చేస్తుంది. `నేను ఎవరికన్నా మెరుగ్గా లేనని తెలుసుకోవడానికి వినయపూర్వకంగా ఉంటాను. కానీ నేను మిగతావారి కంటే భిన్నంగా ఉన్నానని చెప్పడానికి సంతోషిస్తాన`ని తెలిపింది.

ప్రియమణి ఇటీవల `నారప్ప` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది. చాలా గ్యాప్‌తో ఆమె చేసిన చిత్రమిది. ఇందులో డీ గ్లామర్‌ లుక్‌లో వాహ్‌ అనిపించింది. మరోవైపు `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2`లోనూ నటించింది ప్రియమణి. 

ప్రస్తుతం తెలుగులో `విరాటపర్వం`లో నటిస్తుంది. ఇందులో ఆమె నక్సల్‌ పాత్రలో కనిపించబోతుంది ప్రియమణి. దీంతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ప్రియమణి ఈ సారి `ఢీ` షోలో లంగా వోణిలో సందడి చేయబోతుంది. పల్లెటూరి స్పెషల్‌గా ఈ వారం షోని నిర్వహిస్తున్నారు. దీంతో అందరు పల్లెటూరి జనాల దుస్తుల్లో కనిపించబోతున్నారు.

ఈ సందర్భంగా వీరు చేసిన సందడి అంతా ఇంతా కాదు. స్టేజ్‌పై దుమ్ములేపేలా డాన్స్ చేస్తూ ఆడియెన్స్ ని ఉర్రూతలూగించబోతున్నారు. ఈ వారం షోలో ఇదే హైలైట్‌గా నిలవబోతుంది.

click me!