పొలిటికల్ వివాదంలో చిక్కుకున్న యాంకర్ ప్రదీప్... బహిరంగ క్షమాపణకు డిమాండ్!

First Published Jun 21, 2021, 11:19 AM IST


బుల్లితెర యాంకర్స్, కమెడియన్స్ చేసిన వ్యాఖ్యలు పలుమార్లు వివాదాస్పదం అయ్యాయి. జబర్దస్త్ షో వేదికగా ఓ కులంవారిని కించపరిచేలా మాట్లాడాడని కమెడియన్ టిల్లు వేణుపై దాడి జరిగింది. ఇటీవల టీవి షోలో హైపర్ ఆది మాటలు తెలంగాణా సంస్కృతిని కించపరిచేవిగా ఉన్నాయంటూ వివాదం చెలరేగింది. 

హైపర్ ఆది సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా స్టార్ యాంకర్ ప్రదీప్ ఓ రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు.
undefined
ఆయన ఓ టెలివిజన్ ఈవెంట్ లో ఏపీ రాజధాని విషయంలో చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నారు. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
undefined
జీ తెలుగులో ప్రసారం అవుతున్న సీరియల్స్ అవార్డ్స్ వేడుక జరిగింది. సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ పేరుతో ప్రసారమైన కార్యక్రమంలో బుల్లితెర సీరియల్ నటులు అందరూ పాల్గొన్నారు.
undefined
ఈ షోకి యాంకర్ గా ప్రదీప్ వ్యవహరించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఓ సంధర్భంలో ప్రదీప్ ఆంధ్రప్రదేశ్ రాజధాని వైజాగ్ అంటూ సంభోదించారు. ఈ కామెంట్ ని అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కే శ్రీనివాసరావు తప్పుబట్టారు.
undefined
అమరావతి రైతుల మనోభావాలు కించపరిచే విధంగా ఏపీ రాజధాని వైజాగ్ అని ప్రదీప్ ఎలా అంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏపీ రాజధానుల అంశం కోర్టులో నడుస్తుండగా ఇలాంటి వ్యాఖ్యలు సమంజం కాదని వారు అంటున్నారు.
undefined
ఈ విషయమై ప్రదీప్ బహిరంగ క్షమాపణ కోరుతూ, వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, లేదంటే హైదరాబాద్ లోని ఆయన ఇంటిని ముట్టడిస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరి ఈ వివాదంపై ప్రదీప్ ఎలా స్పందిస్తారో చూడాలి.
undefined
click me!