ఇంతకీ మోనాల్ ఎవరి ప్రేమలో ఉంది...నేటి ఎపిసోడ్ లోని ఆసక్తికర అంశాలు ఇవే

First Published Oct 6, 2020, 11:59 PM IST

నిన్న నామినేషన్స్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగగా నేడు అనేక ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. మోనాల్ ఇంతకీ ఎవరికి దగ్గరైంది అనే విషయంపై సందిగ్దత కొనసాగుతుంది. 
 

నిన్నటి ఎపిసోడ్ లో అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్స్ డే కావడంతో బిగ్ బాస్ హౌస్ కొంచెం హాట్ హాట్ గానే సాగింది. ఎలిమినేషన్స్ లో భాగంగా బిగ్ బాస్ నిర్వహించిన టాస్క్ ఇంటి సభ్యుల మధ్య గొడవలకు కారణం అయ్యింది.
undefined
ఇక నేటి వారంలో ఎలిమినేషన్స్ కోసం 9మంది సభ్యులునామినేట్ అయ్యారు. అభిజిత్, సోహైల్, లాస్య, సుజాత, అఖిల్, రాజశేఖర్, ఆరియానా, నోయల్, మోనాల్ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరిగింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నేటి ఎలిమేషన్ లో ఉండడం విశేషం.
undefined
యాంకర్ లాస్యబాగా ఏడ్చేశారు, ఆమె అంతలా ఏడవడానికి నిన్న జరిగిన సంఘటన అని అర్థం అయ్యింది. గంగవ్వ ఆమెను ఓదార్చుతూ ధైర్యం చెప్పింది. దివి తన వంట బాలేదని చెప్పిందని తలుచుకుని ఏడ్చేసింది.
undefined
ఎప్పటిలాగేమోనాల్ వాష్ రూం దగ్గర ఏడుపు స్టార్ట్ చేసింది. అక్కడ ఉన్నఅభిజిత్సమస్యకు నేనే కారణం అని ఆమెను ఓదార్చేప్రయత్నం చేశారు. ఆమె గురించి కేవలం హారికతో డిస్కస్ చేసినట్లు చెప్పారు.
undefined
ఇక అర్థరాత్రి 12 గంటలకు అఖిల్-మోనాల్‌లు ఎప్పటిలాగే ముచ్చట్లు పెట్టారు. అభిజిత్ తనతో అన్న మాటలను చెప్పడమే కాకుండా.. నువ్ ఐ లైక్ యు.. ఐ లైక్ యు అన్నాననే మాటలు నువ్ మళ్లీ మళ్లీ ఎందుకు పాయింట్ చేస్తున్నావ్.. ఇది నా టాపిక్ కాదు.. నామినేషన్ కదా అంటూ అఖిల్ దగ్గర తెగ బాధపడిపోయింది మోనాల్.
undefined
నీ గురించి మాట్లాడడానికి నాకు రైట్స్ ఉన్నాయని చెప్పావ్, అందుకే నీ గురించి మాట్లాడాను అని అఖిల్ చెప్పారు. దీనితో అసలు మోనాల్ ఎవరికి దగ్గరవుతుందనే విషయంలోకన్ఫ్యూషన్ ఏర్పడింది. ఐతే మోనాల్ని అఖిల్ అర్థరాత్రి ఓదార్చడం షోలోఆసక్తికర అంశం.
undefined
click me!