నిద్రలో కుమారుడు మృతి.. మూడు రోజులు శవంతో తల్లి..!

By telugu news teamFirst Published Sep 9, 2021, 8:39 AM IST
Highlights

 చనిపోయాడని తెలుసుకొని ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఎవరికీ చెప్పకుండా ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచి రోదిస్తూనే ఉంది. 

అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు.. కళ్ల ముందే నిద్రలోనే మరణించాడు.  ఉదయాన్నే కొడుకును నిద్రలేపడానికి ప్రయత్నించినా.. లేకపోవడంతో.. ఆ తల్లి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.  కాగా.. మూడు రోజులపాటు.. శవాన్ని ఇంట్లోనే ఉంచుకొని ఆ తల్లి ఏడుస్తూనే ఉంది. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నెల్లూరు ఫత్తేఖాన్ పేట తామరవీధికి చెందిన వెంకట రాజేష్(37) కు రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. విభేదాలతో  కొన్నాళ్ల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో రాజేష్, అతని తల్లి విజలక్ష్మి మానసికంగా కుంగిపోయారు. ఆలస్యంగా నిద్ర లేపాలని.. తల్లికి చెప్పి.. ఈ నెల 5వ తేదీ రాత్రి రాజేష్ నిద్రపోయాడు.

ఆరో తేదీ సాయంత్రం లేపినా.. అతడిలో కదలిక లేదు. దీంతో.. చనిపోయాడని తెలుసుకొని ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఎవరికీ చెప్పకుండా ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచి రోదిస్తూనే ఉంది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. స్థానికులు పోలీసులు సమాచారం అందించారు.

ఎస్సై సైదులు వచ్చి చూడగా రాజేష్ మృతదేహం కళ్లుని స్థితిలో కనిపించింది. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు రమేష్ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో మృతి చెందాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

click me!