టీడీపీకి భయమేస్తోంది.. సానుభూతి కోసమే బాబు ఢిల్లీ టూర్: మోపిదేవి

By sivanagaprasad kodatiFirst Published Oct 28, 2018, 12:29 PM IST
Highlights

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ నేత మోపిదేవి వెంకటరమణ. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్‌పై దాడి ఘటనను పక్కదారి పట్టించేందుకే.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారని ఆరోపించారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ నేత మోపిదేవి వెంకటరమణ. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్‌పై దాడి ఘటనను పక్కదారి పట్టించేందుకే.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారని ఆరోపించారు.

తమ అధినేతపై జరిగిన దాడి ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని వెంకటరమణ డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌లపై కేంద్రం విచారణకు ఆదేశిస్తుందన్న భయంలో టీడీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు.

ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి సాధించింది శూన్యమని.. కేవలం విపక్షాల సానుభూతి కోసమే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని మోపిదేవి ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏదో జరుగుతుందన్న భ్రమ కల్పించేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వెంకటరమన ఆరోపించారు.#

వాంగ్మూలం ఎందుకివ్వడు.. జగన్‌పై కేసు వేస్తా: మంత్రి పితాని

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

ఆపరేషన్ గరుడలో మరో కుట్రను బయటపెట్టిన శివాజీ

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

జగనే కావాలని కత్తితో పొడిపించుకున్నడు... పరిటాల సునీత

జగన్ పై దాడి గురించి వారికి ముందే తెలుసా?

జగన్ పై దాడి: శ్రీనివాస్ అందులో ఆరితేరినవాడు
 

click me!