• All
  • 6 NEWS
  • 10 PHOTOS
16 Stories
Asianet Image

Kia Engine Theft: కియా ఇంజిన్ల చోరీలో బిగ్‌ ట్విస్ట్‌... లారీలు స్వాధీనం!

Apr 27 2025, 01:22 PM IST

Kia Engine Theft: ఏపీలోని కియా కార్ల కంపెనీలో ఇంజిన్లు చోరీ కేసులో పురోగతి కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న కియా కారు పరిశ్రమకు చెందిన ఇంజిన్లు సుమారు 900 వరకు చోరీకి గురైన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు క్షుణ్నంగా విచారణ జరుపుతున్నారు. చోరీకి పాల్పడిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన 9 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే.. ఒక్కసారే 900 ఇంజిన్లు మాయం అవడం వెనుక పెద్ద ముఠా ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంజిన్లు తరలించేందుకు వినియోగించిన లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 

Top Stories