దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా భారత మార్కెట్లో తన పట్టును పటిష్టం చేసుకునే పనిలో పడింది. కియా భారతీయ అనుబంధ సంస్థ కియా ఇండియా కొత్త ఏడాది దేశంలో సెల్టోస్ SUV అప్ డేటెడ్ వెర్షన్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, అప్ డేటెడ్ కియా సెల్టోస్ SUV ఆటో ఎక్స్పో 2023లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. 2023 కియా సెల్టోస్ కొత్త టర్బో పెట్రోల్ ఇంజన్, అప్డేట్ డిజైన్, అప్గ్రేడ్ చేసిన క్యాబిన్, ఫీచర్లతో లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు.