ఫోన్ ట్యాపింగ్: వివరాలివ్వాలని తెలంగాణ డీజీపీకి సీఈఓ ఆదేశం
ప్రజా కూటమి నేతల ఫోన్ల ట్యాపింగ్పై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ సీరియస్ అయ్యారు.
హైదరాబాద్: ప్రజా కూటమి నేతల ఫోన్ల ట్యాపింగ్పై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ సీరియస్ అయ్యారు. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారో వివరాలు ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
తమ ఫోన్లను టీఆర్ఎస్ నేతలు ట్యాప్ చేస్తున్నారని ప్రజా కూటమి నేతలు గురువారం నాడు సీఈఓ రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై సీఈఓ స్పందించారు. ప్రజా కూటమి నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారో వివరాలను ఇవ్వాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని సీఈఓ రజత్ కుమార్ ఆదేశించారు.తెలంగాణలో ఎఎరి ఫోన్లనైనా ట్యాప్ చేస్తున్నారా.. చేస్తే ఎవరెవరి ఫోన్లు చేస్తున్నారో చెప్పాలని సీఈఓ రజత్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు.
తెలంగాణలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులకు కూడ ప్రజా కూటమి నేతలు గతంలో ఫిర్యాదు చేశారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన రైళ్లకు చెందిన రైలు బోగీలపై అపద్ధర్మ సీఎం కేసీఆర్ ఫోటోతో కొన్ని పథకాల ప్రచారం సాగుతున్న విషయంపై కూడ రజత్ కుమార్ స్పందించారు. ఈ విషయమై దక్షిణ మధ్య రైల్వే జీఎంను నివేదిక కోరినట్టు సమాచారం.
సంబంధిత వార్తలు
వారు ఎలక్షన్ కోడ్ పాటించడంలేదు...సీఈవోకు మహాకూటమి నేతల ఫిర్యాదు
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు
హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం
టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు
టీజేఎస్తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే
కోదండరామ్కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?