Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడ్ని కిడ్నాప్ చేయబోయిన ప్రియురాలు.. తండ్రి మృతి..

ప్రియుడ్ని కిడ్నాప్ చేయడానికి ప్రియురాలు ప్రయత్నించడంలో ప్రియుడి తండ్రి చనిపోయిన దారుణ ఘటన విశాఖలో జరిగింది. విశాఖ జిల్ల తగరపు వలస బాలాజీనగర్ కి చెందిన రౌతు వంశీకృష్ణ మద్యాహ్నం  అదేప్రాంతంలో తండ్రి వెంకటరావు నడిపే చికెన్ షాపుకు వెడుతున్నాడు. 

woman tries to kidnap her lover, father died at vizag - bsb
Author
Hyderabad, First Published Nov 11, 2020, 9:59 AM IST

ప్రియుడ్ని కిడ్నాప్ చేయడానికి ప్రియురాలు ప్రయత్నించడంలో ప్రియుడి తండ్రి చనిపోయిన దారుణ ఘటన విశాఖలో జరిగింది. విశాఖ జిల్ల తగరపు వలస బాలాజీనగర్ కి చెందిన రౌతు వంశీకృష్ణ మద్యాహ్నం  అదేప్రాంతంలో తండ్రి వెంకటరావు నడిపే చికెన్ షాపుకు వెడుతున్నాడు. 

ఈ క్రమంలో జాతీయ రహదారి అండర్ పాస్ వంతెన కింద నలుగురు యువకులతో కలిసి 35యేళ్ల ఓ మహిళ మాటువేసి వంశీకృష్ణను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించింది. చికెన్ షాపుకు దగ్గర్లోనే ఇది జరగడంతో గమనించిన వెంకటరావు పరిగెత్తుకొచ్చాడు. నా కొడుకు దగ్గరికెందుకు వచ్చావు అంటూ ఆమెను నిలదీసాడు. 

దీంతో ఇరువర్గాల మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో వెంటరావు అక్కడికక్కడే కుప్పకూటి ప్రాణాలు విడిచాడు. ఇది గమనించిన ఆ మహిళ, నలుగురు యువకులు కారులు పారిపోయారు. 

శ్రీకాకుళానికి చెందిన ఆ మహిళ ఇద్దరు పిల్లలు, భర్తతో రెండేళ్ల కిందట బాలాజీనగర్ లో ఉన్నారు. ఈ క్రమంలో వంశీకృష్ణతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఇంట్లోనుండి పారిపోయారు. ఆ తరువాత దొరికారు. అనంతరం జరిగిన గొడవల్లో వంశీ నాన్న వెంకటరావు ఆ మహిళకు రెండు లక్షలిచ్చి తన కొడుకు జోలికి రావద్దని పేపర్స్ రాయించుకున్నారని మృతుని భార్య తెలిపింది. 

వెంకటరావు భార్య ఫిర్యాదు మేరకు మధురవాడ ఏసీపీ రవిశంకర్ రెడ్డి నిందితులపై 304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios