Asianet News TeluguAsianet News Telugu

ఎనిమిదేళ్ల బాలిక దారుణహత్య: పక్కింటి వ్యక్తే నిందితుడు..పట్టించిన భార్య

విజయవాడలో ఎనిమిదేళ్ల బాలిక దారుణహత్యకు గురైంది. భవానీపురానికి చెందిన మువ్వ ద్వారక ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు

8 years old girl killed in bhavanipuram vijayawada
Author
Vijayawada, First Published Nov 11, 2019, 5:24 PM IST

విజయవాడలో ఎనిమిదేళ్ల బాలిక దారుణహత్యకు గురైంది. భవానీపురానికి చెందిన మువ్వ ద్వారక ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టి పక్కింట్లోనే  చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ద్వారక మృతితో తల్లీదండ్రుడు కన్నీరు మున్నీరవుతున్నారు.

చిన్నారి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం తెలిసినవారిని విచారించారు. ప్రతి ఆదివారం సెలవు కావడంతో దగ్గరలోని నాయనమ్మ ఇంటికి వెళ్లి చిన్నారి ఆడుకుని వచ్చేదని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు.

అయితే సమయం గడిచేకొద్ది దీని వెనుక కిడ్నాప్ కోణం ఉందని పోలీసులు భావించారు. దీనిలో భాగంగా సోమవారం డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్‌ సాయంతో పాప ఆచూకీ కోసం గాలించడంతో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

also Read:చిత్తూరు బాలికపై అత్యాచారం, హత్య... మహిళా కమీషన్ ఛైర్మన్ ఏమన్నారంటే

ఈ క్రమంలో ద్వారక ఇంటిపక్కన నివసిస్తున్న మేకల ప్రకాశ్ ప్రవర్తన స్థానికులకు, పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించింది. అటు తన భర్తపై అనుమానంతో ఇంట్లో ఉన్న గోనెసంచెను చింపగా అందులో బాలిక మృతదేహం బయటపడింది.

8 years old girl killed in bhavanipuram vijayawada

వెంటనే ఆమె ఈ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో వారు ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడు ప్రకాశ్‌కు దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 

ద్వారకను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టిన అనంతరం పాప ఆచూకీ కోసం ఆమె తల్లీదండ్రులతో కలిసి ప్రకాశ్ గాలింపు చర్యల్లో పాల్గొన్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

మదనపల్లె సమీపంలోని గట్టు గ్రామంలో ఓ కామాంధుడి చేతిలో వర్షిణి అనే చిన్నారి బాలికను ఓ కామాంధుడు పొట్టనబెట్టుకున్నాడు. పెళ్లింటినుండి బాలికను అపహరించుకుపోయిన దుండగుడు అభం శుభం తెలియని బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశాడు. ఆ దుర్ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.

Also Read:16 ఏళ్ల కుర్రాడితో ఎంజాయ్: అడ్డుగా ఉన్న చిన్నారిని చంపిన తల్లి

ఇలా తమ కూతురు దారుణ హత్యకు గురవడంతో తల్లిదండ్రులు కన్నీరు మన్నీరుగా విలపిస్తున్నారు. కన్న కూతురిని  కోల్పోయి పుట్టెడు బాధలో వున్నవారిని రాష్ట్ర  మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ  పరామర్శించారు.

వారిని ఓదార్చి ధైర్యం చెప్పి అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితున్ని ఎట్టి పరిస్థితుల్లో  వదిలిపెట్టబోమని... కఠనంగా శిక్షిస్తామని తెలిపారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios