Asianet News TeluguAsianet News Telugu

రాముడి పేరుతో రౌడీయిజం... ఇదే బిజెపి రాజకీయం : కల్వకుంట్ల కవిత ఫైర్

కామారెడ్డి :  బిజెపి రాజకీయాలు 'రామ్ నామ్ జప్నా... పరాయ లీడర్ అప్నా(రాముని పేరు జపించడం... 

కామారెడ్డి :  బిజెపి రాజకీయాలు 'రామ్ నామ్ జప్నా... పరాయ లీడర్ అప్నా(రాముని పేరు జపించడం... ఇతర పార్టీల లీడర్లను చేర్చుకోవడం)' అన్నట్లుగా వున్నాయంటూ సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేసారు. బిజెపిలో చేరడానికి నిరాకరిస్తున్న నాయకులపై ఈడి, ఐటి, సిబిఐ దాడుల పేరిట బెదిరింపులకు దిగుతారని అన్నారు. ఇలా మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై గతకొద్దిరోజులుగా కేంద్ర సంస్థలు దాడులు చేస్తున్నాయని... ఈ దాడులకు తెలంగాణ బిడ్డలు భయపడబోరని అన్నారు. మీరు ఏం చేసినా భయపడబోం... నిలబడి పోరాడి గెలుస్తాం.... తిరిగి ప్రజలకోసం పనిచేస్తామని కవిత అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేటలో జరిగిన టిఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మ్మేళనంలో ఎమ్మెల్సి క‌విత పాల్గొన్నారు. ఈ  సందర్భంగా తెలంగాణలో కేంద్ర సంస్థలు దాడులు, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, బిజెపి నేత బిఎల్ సంతోష్ విచారణకు హాజరుకాకపోవడం, బండి సంజయ్ కన్నీరు పెట్టుకోవడంపై కవిత స్పందించారు.  బిజెపి రాముని పేరు చేప్పి రౌడియిజం చేస్తోందని కవిత మండిపడ్డారు.