దయనీయంగా ముంపు ప్రాంతాల బాధితుల పరిస్థితి..
భారీ వర్షాలకు హైదరాబాద్, రామాంతపూర్ చెరువు కట్ట కింద ఉన్న కాలనీల్లో పరిస్థితి దయనీయంగా మారింది.
భారీ వర్షాలకు హైదరాబాద్, రామాంతపూర్ చెరువు కట్ట కింద ఉన్న కాలనీల్లో పరిస్థితి దయనీయంగా మారింది. సహాయకచర్యలు అందడం లేదు. అడిగితే ఇక్కడ ఇల్లు ఎవరు కట్టుకోమన్నరని ప్రశ్నిస్తున్నారు. మూడు రోజులుగా తిండిలేక, కరెంట్ లేక, కనీసం సమాచారం అందించే అవకాశం లేక అల్లాడి పోతున్నారు. ఇక గుడిసెల్లో ఉండేవారి పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. వర్షాలకు ఎంత మంది చనిపోయారో లెక్కేలేదు.. వరద నీటిలో శవాలు కొట్టుకుపోతున్నాయని వారు చెబుతున్న తీరు దయనీయంగా ఉంది.