Asianet News TeluguAsianet News Telugu

44 బ్రిడ్జిలను జాతికి అంకితం చేసిన రాజ్ నాథ్ సింగ్.. ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు..

బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బిఆర్‌ఓ) నిర్మించిన 44 వంతెనలను డిఫెన్స్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. 

బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బిఆర్‌ఓ) నిర్మించిన 44 వంతెనలను డిఫెన్స్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. దీంతోపాటుఅరుణాచల్ ప్రదేశ్‌లోని నెచిఫు సొరంగానికి ఈ రోజు పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ, ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్న 44 వంతెనలు దేశంలోని సుదూర ప్రాంతాలతో కనెక్టివిటీకి,  ఆ ప్రాంతాల అభివృద్ధిలో కొత్త శకానికి దారితీస్తాయన్నారు.